Telugu News » Rohini Acharya : చెత్త మళ్లీ డస్ట్ బిన్‌లోకి చేరింది… నితీశ్ కుమార్ పై లాలూ కూతురు ఫైర్….!

Rohini Acharya : చెత్త మళ్లీ డస్ట్ బిన్‌లోకి చేరింది… నితీశ్ కుమార్ పై లాలూ కూతురు ఫైర్….!

నితీశ్ కుమార్‌ను చెత్తతో పోలుస్తూ ఆమె విమర్శలు గుప్పించారు. చెత్త ఇప్పుడు చెత్త కుప్పలోకి వెళ్లిపోయిందని చెప్పారు.

by Ramu
Garbage back in dump Lalu Yadavs daughter on Nitish Kumars flip flop

విపక్ష ఇండియా కూటమి (India Alliance)నుంచి నితీశ్ కుమార్ (Nitish Kumar) వైదొలగడం, బిహార్ సీఎం పదవికి రాజీనామా చేయడం వంటి పరిణామాలపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కూతురు రోహిణి ఆచార్య (Rohini Acharya) ట్వీట్ చేశారు.

Garbage back in dump Lalu Yadavs daughter on Nitish Kumars flip flop

నితీశ్ కుమార్‌ను చెత్తతో పోలుస్తూ ఆమె విమర్శలు గుప్పించారు. చెత్త ఇప్పుడు చెత్త కుప్పలోకి వెళ్లిపోయిందని చెప్పారు. అత్యంత దుర్వాసనతో కూడిన చెత్త కుప్పను పొందినందుకు డస్ట్‌బిన్‌కు అభినందనలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతకు ముందు నితీశ్ కుమార్ రాజీనామా చేయక ముందు ఆమె ఎక్స్‌‌‌లో స్పందించారు.

తమ ఊపిరి ఉన్నంత వరకు, మతతత్వ శక్తులపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అనంతరం 2017లో తన తండ్రి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన ట్వీట్ ఆమె రీ ట్వీట్ చేశారు. 2017లో కూడా నితీశ్ కుమార్ మిత్రపక్షం ఆర్జేడీని వదిలి బీజేపీ వైపు చేరారు. అప్పుడు నితీశ్ కుమార్ పై లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

నితీశ్ కుమార్ ఒక పాము లాంటి వాడని అన్నారు. పాము ఎలాగైతే తన శరీరం నుంచి కుబుసాన్ని విడిచి పెడుతుందో…. నితీశ్ కూడా ప్రతి రెండేండ్లకు ఒకసారి తన మిత్ర పక్షాను వదిలి పెడతారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఎవరికైనా సందేహం ఉందా అని ఆయన ప్రశ్నించారు.

You may also like

Leave a Comment