Telugu News » AP Assembly: స్పీకర్‌పై పేపర్లు విసిరిన టీడీపీ సభ్యులు.. అసెంబ్లీ నుంచి సస్పెన్షన్..!

AP Assembly: స్పీకర్‌పై పేపర్లు విసిరిన టీడీపీ సభ్యులు.. అసెంబ్లీ నుంచి సస్పెన్షన్..!

వాయిదా తీర్మానంపై చర్చించాలని టీడీపీ ఎమ్మెల్యేలు(TDP MLA’s) పట్టుబట్టారు. పేపర్లు చింపి విజిల్స్ వేస్తూ టీడీపీ సభ్యుల ఆందోళన చేపట్టారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించడంతో స్పీకర్ టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేశారు.

by Mano
AP Assembly: TDP members who threw papers at the speaker.. suspension from the assembly..!

ఏపీ అసెంబ్లీ(AP Assembly) నుంచి టీడీపీ(TDP) సభ్యులు సస్పెండ్ అయ్యారు. ధరల పెరుగుదలపై చర్చించాలని సభలో టీడీపీ డిమాండ్ చేసింది. వాయిదా తీర్మానంపై చర్చించాలని టీడీపీ ఎమ్మెల్యేలు(TDP MLA’s) పట్టుబట్టారు. పేపర్లు చింపి విజిల్స్ వేస్తూ టీడీపీ సభ్యుల ఆందోళన చేపట్టారు.

AP Assembly: TDP members who threw papers at the speaker.. suspension from the assembly..!

స్పీకర్ పోడియంను టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు. పెద్దఎత్తున నినాదాలు చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాం పైకి పేపర్లు చించి విసిరేశారు. వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతున్న సందర్భంలో టీడీపీ సభ్యులు గొడవకు దిగారు.

సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక రోజు పాటు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. సభ నుంచి టీడీపీ సభ్యులు బయటకు వెళ్లకపోవడంతో మార్షల్స్ వచ్చి వారిని బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కాగా, స్పీకర్‌పై టీడీపీ సభ్యుల వ్యవహార శైలి సరైంది కాదంటూ అంబటి రాంబాబు అన్నారు.

సభా మర్యాదలను టీడీపీ సభ్యులు పాటించడంలేదంటూ ధ్వజమెత్తారు. స్పీకర్‌పై పేపర్లు విసరడం మర్యాద కాదన్నారు. చర్చ సజావుగా జరిగేలా టీడీపీ ఎమ్మెల్యేలు సహకరించాలన్నారు. లేదంటే వెళ్లిపోవాలని సూచించారు. మరోవైపు, ఏపీ చలో అసెంబ్లీకి సర్పంచుల సంఘాల పిలుపుతో అసెంబ్లీ ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

You may also like

Leave a Comment