Telugu News » Delhi Metro: మెట్రో స్టేషన్‌లో ఊడిపడిన పెచ్చులు.. ముగ్గురికి గాయాలు..!

Delhi Metro: మెట్రో స్టేషన్‌లో ఊడిపడిన పెచ్చులు.. ముగ్గురికి గాయాలు..!

ఈశాన్య ఢిల్లీలోని పింక్ లైన్‌లో ఉన్న గోకుల్‌పురి మెట్రో స్టేషన్‌(Gokulpuri Metro Station)లో కొంత భాగం కూలింది. ఉదయం 11 గంటలకు ఎలివేటెడ్ ప్లాట్‌ఫారమ్ సరిహద్దు గోడ, స్లాబ్‌లో ఒక వైపు పెచ్చులూడాయి.

by Mano
Delhi Metro: Three people were injured in a landslide at the metro station..!

దేశ రాజధాని ఢిల్లీలో మెట్రో స్టేషన్‌(Delhi Metro Station) నిర్మాణంలో లోపాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. మెట్రో స్టేషన్‌లో స్లాబ్‌ పెచ్చులు ఊడిపడి ముగ్గురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది.

Delhi Metro: Three people were injured in a landslide at the metro station..!

ఈశాన్య ఢిల్లీలోని పింక్ లైన్‌లో ఉన్న గోకుల్‌పురి మెట్రో స్టేషన్‌(Gokulpuri Metro Station)లో కొంత భాగం కూలింది. ఉదయం 11 గంటలకు ఎలివేటెడ్ ప్లాట్‌ఫారమ్ సరిహద్దు గోడ, స్లాబ్‌లో ఒక వైపు పెచ్చులూడాయి. కింద ఉన్న రహదారిపై అవి పడ్డాయి. అక్కడ పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలు ఈ శిథిలాల కింద కూరుకుపోయాయి.

స్కూటర్‌పై ఉన్న ఓ వ్యక్తి కూడా శిథిలాల కింద చిక్కుకున్నాడు. అతడు తీవ్రంగా గాయపడ్డాడు. మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయ చర్యలు ముమ్మరం చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తిని స్థానికుల సహాయంతో కాపాడారు.

గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, మెట్రో స్టేషన్ పెచ్చులూడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాసిరకం పనులకు ఈ ఘటన నిదర్శనమని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

You may also like

Leave a Comment