Telugu News » Batti Vikramarka : బస్సా, ఫ్లైటా ఏదైనా ఓకే, కర్ణాటక వెళదామా…కేటీఆర్: భట్టి

Batti Vikramarka : బస్సా, ఫ్లైటా ఏదైనా ఓకే, కర్ణాటక వెళదామా…కేటీఆర్: భట్టి

తెలంగాణలో సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని చెప్పారు.

by Prasanna
Batti

బీఆర్ఎస్ పార్టీ (BRS Party) కాంగ్రెస్ (Congress) పై పసలేని విమర్శలు చేస్తుందని, కర్ణాటక (Karnataka) లో కాంగ్రేస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదనే తప్పుడు ప్రచారాన్ని చేస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్త చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఏం చేస్తుందో చూడాలంటే మంత్రులు కేటీఆర్, హరీష్, ఎమ్మెల్సీ కవితలకు ఫ్లైట్ లేదా బస్సు టికెట్ బుక్ చేస్తానని, చూసేందుకు వస్తారా? అని అన్నారు.

Batti

ఇవాళ ఇందిరా భవన్ లో వార్ రూమ్, కనెక్ట్ సెంటర్ ను ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రారంభించారు. అనంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. తెలంగాణలో సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని చెప్పారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ గ్యారంటీ కార్డులో ఇల్లు, ఇంటి స్థలం కూడా ఉందన్నారు. కాంగ్రెస్ కర్ణాటకలో ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని, ఇక్కడ కేసీఆర్ లెక్క తప్పుడు ప్రకటనలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము బడ్జెట్ అంచనా వేసిన తర్వాతే.. హామీలు ఇస్తున్నామని స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీ లౌకిక వాదీ అని తెలిపారు. దేశం ఏకం చేయాలని పాదయాత్ర చేశారని అన్నారు. అసదుద్దీన్ ఒవైసీ సెక్యులర్ నాయకుడు అయితే రాహుల్ కి సపోర్ట్ చేయాలన్నారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడటం అంటే ఏంఐఏం పార్టీకి బీజేపీ సపోర్ట్ చేయడమే అన్నారు.

 

You may also like

Leave a Comment