Telugu News » Harish Rao : బీజేపీ లేచేది లేదు.. కాంగ్రెస్ గెలిచేది లేదు…..!

Harish Rao : బీజేపీ లేచేది లేదు.. కాంగ్రెస్ గెలిచేది లేదు…..!

సోలిపేట కుటుంబానికి తాను అండగా ఉంటానని చెప్పారు. వారిని రాజకీయంగా నిలబెడుతానన్నారు.

by Ramu
harsih rao fire on bjp and congress

తెలంగాణ (Telangana)లో బీజేపీ (BJP) లేచేది లేదని, కాంగ్రెస్ (Congress) గెలిచేది లేదని మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. రాబోయే ఎన్నిక (Elections) ల్లో ఆ పార్టీల మాటలు నమ్మి ప్రజలు మోస పోవద్దని సూచించారు. సోలిపేట కుటుంబానికి తాను అండగా ఉంటానని చెప్పారు. వారిని రాజకీయంగా నిలబెడుతానన్నారు.

harsih rao fire on bjp and congress

దుబ్బాకలో రూ. 17 కోట్లతో నిర్మించిన ఐఒసి బిల్డింగ్‌ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. రామలింగారెడ్డి విగ్రహాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరిస్తానని కలలో కూడా అనుకోలేదన్నారు. గన్నుతో, పెన్నుతో పోరాటం చేసిన వ్యక్తి రామలింగారెడ్డి అని కొనియాడారు. తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పని చేసి లింగన్న ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.

రామలింగారెడ్డి శంకుస్థాపన చేసిన పనులకు ఈ రోజు రఘునందన్ రావు రిబ్బన్ కట్ చేస్తున్నారని తెలిపారు. రఘునందన్ గెలిచాక మూడు సంవత్సరాల్లో చేసిందేమీ లేదని మండిపడ్డారు. రఘు నందన్ రావు మాయ మాటలు నమ్మి సోలిపేట సుజాత అక్కకు అన్యాయం చేశారన్నారు. అరచేతిలో వైకుంఠం చూపితే నమ్మి మోసపోయామన్నారు. రామలింగారెడ్డి ఆత్మ శాంతి చేకూరాలంటే దుబ్బాక గడ్డమీద గులాబీ జెండా ఎగరాలన్నారు.

అనంతరం కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ…… తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉద్యమం జరిగినా ముందుండే నాయకుడు సోలిపేట రామలింగారెడ్డి అని చెప్పారు. భవిష్యత్తులో రామలింగారెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. తెలంగాణలో ఎన్ని సర్వేలు చేసినా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని చెప్పారు.

You may also like

Leave a Comment