Telugu News » Dil Raju : అల్లుడి గారి కారు చోరీ.. పాపం ఖాకీలు..!!?

Dil Raju : అల్లుడి గారి కారు చోరీ.. పాపం ఖాకీలు..!!?

కారు దొంగలించిన వ్యక్తిని సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు. కాగా ఈ కారు ధర సుమారు 1.7 కోట్లు అని తెలిసింది. కారును దొంగిలించిన వ్యక్తి మన్సూరాబాద్‌ ప్రాంతానికి చెందిన మల్లెల సాయికిరణ్‌గా గుర్తించారు పోలీసులు.

by Venu

ప్రముఖ టాలీవుడ్ (Tollywood) నిర్మాత (producer) దిల్ రాజు (Dil Raju) అల్లుడు అర్చిత్ రెడ్డి (Archit Reddy)కి చెందిన ఓ కాస్ట్లీ కారు చోరీ జరిగింది. హైదరాబాద్ లోని దసపల్లా హోటల్‌ ముందు అర్చిత్ కారు పార్కింగ్ చేసి హోటలకు వెళ్లారు. ముప్పై నిమిషాల తర్వాత బయటకు వచ్చి చూస్తే కారు కనిపించలేదు. వెంటనే జూబ్లీహిల్స్‌ పోలీసులకి ఫిర్యాదు చేశారు దిల్ రాజు అల్లుడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు దొంగలించిన వ్యక్తిని సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు. కాగా ఈ కారు ధర సుమారు 1.7 కోట్లు అని తెలిసింది. కారును దొంగిలించిన వ్యక్తి మన్సూరాబాద్‌ ప్రాంతానికి చెందిన మల్లెల సాయికిరణ్‌గా గుర్తించారు పోలీసులు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా మంత్రి కేటీఆర్ ఈ కారు తీసుకురమ్మన్నారని అందుకే తీసుకు వెళ్తున్నా అని చెప్పాడు.

అంతే కాదు తాను ఆకాష్ అంబానీకి సహాయకుడిని అని ఇప్పుడు అర్జెంట్ గా హృతిక్ రోషన్ ను కలవాలి నేను వెళ్ళాలి వదిలేయండి అంటూ పోలీసులకు చెప్పినట్టు సమాచారం. అతని సమాధానాలతో పోలీసులు షాక్ తిన్నారు. వెంటనే ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు ఫోన్ చేయగా అతడికి మతిస్థిమితం సరిగ్గా లేదు అని.. చికిత్స తీసుకుంటున్నాడని వారు చెప్పారు.

You may also like

Leave a Comment