Telugu News » cyber crime : సైబర్ నేరగాళ్ల నయా మోసం.. రూ.34 లక్షలు మాయం..!!

cyber crime : సైబర్ నేరగాళ్ల నయా మోసం.. రూ.34 లక్షలు మాయం..!!

ఒక్కసారి వారికి చిక్కారంటే.. ఖాతా మొత్తం ఖాళీ చేస్తున్నారు.. ఇప్పటికే లక్షలాది మంది సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి విలవిలలాడిపోయారు.. కొందరు మోసపోయినా బయటకు చెప్పుకోలేని పరిస్థితి.. ఇలాంటి ఘటనే ఏలూరులో వెలుగుచూసింది. ఏకంగా ఓ మహిళ రూ. 34 లక్షలు పోగొట్టుకుంది..

by Venu

మనుషులు (People) లగ్జరీగా (luxury) బ్రతకడానికి ఎన్నో సౌకర్యాలని ఏర్పాటు చేసుకొంటున్నారు. అందులో టెక్నాలజీ (Technology) కూడా ఒకటి. ఈ టెక్నాలజీ పరంగా ప్రపంచం ఊహించని స్థాయికి చేరుకోంది. అరచేతిలో ప్రపంచాన్ని చూడగలుగుతోన్న నేటి మనుషులు.. ఈ టెక్నాలజీని మోసాలు చేయడానికి కూడా వాడటం దురదృష్టకరం.. ముఖ్యంగా ఉద్యోగం, ఉపాధి, తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం.. అని ఆలోచించే వారికి సైబర్‌ నేరగాళ్లు (Cyber ​​criminals) ఎరవేస్తున్నారు..

ఒక్కసారి వారికి చిక్కారంటే.. ఖాతా మొత్తం ఖాళీ చేస్తున్నారు.. ఇప్పటికే లక్షలాది మంది సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి విలవిలలాడిపోయారు.. కొందరు మోసపోయినా బయటకు చెప్పుకోలేని పరిస్థితి.. ఇలాంటి ఘటనే ఏలూరులో వెలుగుచూసింది. ఏకంగా ఓ మహిళ రూ. 34 లక్షలు పోగొట్టుకుంది.. ఓ సైబర్ మోసగాడు మ్యాప్ రివ్యూ వర్క్ ఆఫర్ పేరుతో ఓ లింక్‌ను సదరు మహిళకు పంపించాడు.. పెట్టిన ప్రతి పైసాకి 40 శాతం లాభం పొందొచ్చు అని నమ్మించాడు.

మొదట 500 రూపాయలు పే చేసిన సదరు మహిళకు 40 శాతం లాభం వచ్చినట్టు చూపించారు.. మరింత ఆశపడిన ఆ మహిళా భారీగా డబ్బులు సంపాదించవచ్చు అని ఆలోచనలోకి వెళ్లి.. దఫాలుగా రూ.34 లక్షల 11 వేల 792 రూపాయలు చెల్లించింది. అయితే ఎంతకీ డబ్బు తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించి గగ్గోలు పెడుతూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఏలూరు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

You may also like

Leave a Comment