Telugu News » Kesineni Nani : బెజవాడ కనకదుర్గ గుడిలో కేశినేని నాని.. ఆయన కోసమేనా..?

Kesineni Nani : బెజవాడ కనకదుర్గ గుడిలో కేశినేని నాని.. ఆయన కోసమేనా..?

అమ్మవారి కృపా కటాక్షాలు, ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించినట్టు తెలిపారు కేశినేని. దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మ‌వారిని కోరుకున్నట్టు వెల్లడించారు.

by Venu

విజయవాడలో దసరా శరన్నవాత్రి ఉత్సవాలు (Dussehra Sharannawatri Festivals) ఘనంగా జరుపుకొంటున్నారు భక్తులు.. దేవి శరన్నవరాత్రి మహోత్సవములో భాగంగా ఈరోజు అమ్మ‌వారు సరస్వతీదేవి అవ‌తారంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. కాగా విజయవాడ (Vijayawada)ఎంపీ (MP) కేశినేని నాని (Kesineni Nani) దుర్గ‌మ్మను ద‌ర్శించుకున్నారు.

 

మూలా నక్షత్రం సంద‌ర్భంగా కేశినేని నాని కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు, సారె సమర్పించారు. దర్శన అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలు వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. అమ్మ వారి ఆశీస్సులతో దర్శనం బాగా జరిగిందన్నారు.

అమ్మవారి కృపా కటాక్షాలు, ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించినట్టు తెలిపారు కేశినేని. దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మ‌వారిని కోరుకున్నట్టు వెల్లడించారు. మరోవైపు 45 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేసిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు(Chandrababu) అని కొనియాడారు. ఆయ‌న సంపూర్ణ ఆయురారోగ్యాలతో క్షేమంగా బయటకురావాలని కోరుకున్నట్టు కేశినేని నాని వెల్ల‌డించారు.

You may also like

Leave a Comment