Telugu News » Mothkupalli: చంద్రబాబును చంపేందుకు కుట్ర.. బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు!

Mothkupalli: చంద్రబాబును చంపేందుకు కుట్ర.. బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు!

హైదరాబాద్‌(Hyderabad)లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సీఎం జగన్‌ చర్యలపై తీవ్రంగా ఖండించారు.

by Mano
Mothkupalli: Conspiracy to kill Chandrababu.. BRS leader Mothkupalli sensational comments!

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు(Ex cm chandra babu) అరెస్టుపై బీఆర్ఎస్ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు(mothkupalli narsimhulu) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌(Hyderabad)లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సీఎం జగన్‌ చర్యలపై తీవ్రంగా ఖండించారు.

 Mothkupalli: Conspiracy to kill Chandrababu.. BRS leader Mothkupalli sensational comments!

గతంలో కూడా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఒక్కరోజు దీక్ష చేపట్టిన ఆయన తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు పార్టీలు కలిసి కుట్ర చేసి చంద్రబాబును చంపాలని చూస్తున్నాయని నర్సింహులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపుతున్నాయి.

చంద్రబాబును జైల్లో హింసించి బాధ పెడుతున్నారని.. బాబు ఆరోగ్యాన్ని దెబ్బతీసి చంపాలని ప్లాన్ చేస్తున్నారని నర్సింహులు అన్నారు. చంద్రబాబుకు ఏమైనా అయితే, సీఎంలు జగన్, కేసీఆర్, బీజేపీదే బాధ్యత అని హెచ్చరించారు. జైలు నుంచి చంద్రబాబును బయటకు రాకుండా చేసి ఓట్లను గుద్దుకోవాలని ప్రయత్నిస్తున్నారా? అని ప్రశ్నించారు.

సీఎం జగన్ మళ్లీ డబ్బులు పంచి గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు కుటుంబానికి రక్షణ లేదని ఏపీలో పేద ప్రజలు బతికే పరిస్థితి లేకుండా లేకుండా చేశారని వైసీపీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా పరిపాలన చేస్తున్న ఏకైక సీఎం జగన్ అని ఎద్దేవా చేశారు.

You may also like

Leave a Comment