Telugu News » Murder in Ap: కళ్లలో కారం చల్లి.. వైసీపీ కార్యకర్త దారుణ హత్య..!

Murder in Ap: కళ్లలో కారం చల్లి.. వైసీపీ కార్యకర్త దారుణ హత్య..!

కృష్ణారెడ్డి పులిపాడు అనే వ్యక్తి వైసీపీ కార్యకర్త. ప్రభుత్వ వైన్‌షాప్‌లో సూపర్ వైజర్‌గా పని చేస్తున్నాడు. జంగమహేశ్వరం గ్రామంలో కృష్ణారావు ఉన్న క్రమంలో ముసుగులు ధరించిన ఐదుగురు ప్రత్యర్థులు కళ్లలో కారం చల్లి హతమార్చారు.

by Mano
Murder in Ap: A YCP worker was brutally murdered by throwing pepper in his eyes..!

కళ్లలో కారం చల్లి.. వేటకొడవళ్లు, గొడ్డళ్లతో వెంబడించి.. ఓ వైసీపీ(Ycp) కార్యకర్త ను అతి దారుణంగా హత్య(murder) చేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పల్నాడు(palnadu) జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

Murder in Ap: A YCP worker was brutally murdered by throwing pepper in his eyes..!
కృష్ణారెడ్డి పులిపాడు అనే వ్యక్తి వైసీపీ కార్యకర్త. ప్రభుత్వ వైన్‌షాప్‌లో సూపర్ వైజర్‌గా పని చేస్తున్నాడు. జంగమహేశ్వరం గ్రామంలో కృష్ణారావు ఉన్న క్రమంలో ముసుగులు ధరించిన ఐదుగురు ప్రత్యర్థులు కళ్లలో కారం చల్లి హతమార్చారు. ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్ష్యులు మీడియాతో వెల్లడించారు. ఈ హత్య జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది.

కృష్ణారెడ్డి మృతదేహాన్ని గురజాల ప్రభుత్వాసుపత్రిలో భద్రపరిచారు. శాంతిభద్రతల పర్యవేక్షణకు గ్రామంలో పోలీసు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కృష్ణారెడ్డిని హతమార్చిన వారిని పట్టుకునేందుకు మూడు స్పెషల్ టీంలను పోలీసు శాఖ రంగంలోకి దింపింది.

ఈ హత్యకు రాజకీయాలు కారణమా లేక ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గురజాల మండలంలో ఉన్న జంగమహేశ్వరం గ్రామానికి ఫ్యాక్షన్ చరిత్ర ఉండటం గమనార్హం. మరోవైపు, టీడీపీ వాళ్లే ఈ హత్య చేయించారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

You may also like

Leave a Comment