Telugu News » Accident in USA: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఆరుగురు ఆంధ్రా వాసులు మృతి..!

Accident in USA: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఆరుగురు ఆంధ్రా వాసులు మృతి..!

అమెరికా(USA)లోని టెక్సాస్‌(Texas)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆరుగురు మృతిచెందారు. అతి వేగంగా వస్తున్న ట్రక్ తూ.గో జిల్లా వాసులు ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీ కొట్టినట్లు సమాచారం.

by Mano
Accident in USA: A terrible accident in America.. Six residents of Tu.go district died..!

అమెరికా(USA)లోని టెక్సాస్‌(Texas)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆరుగురు మృతిచెందారు. జాన్సన్ కౌంటి క్లూబర్న్ హైవే నెంబర్ 67లో ఈ ప్రమాదం సంభవించింది. మార్కెట్ టు హైవే రోడ్‌లో అతి వేగంగా వస్తున్న ట్రక్ తూ.గో జిల్లా వాసులు ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీ కొట్టినట్లు సమాచారం.

Accident in USA: A terrible accident in America.. Six residents of Tu.go district died..!

విషయం తెలుసుకున్న రెస్క్యూ బృందాలు వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రమాద తీవ్ర ఎక్కువగా ఉండటంతో.. ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని తెలుస్తోంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువగా విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.

అయితే, మృతుల వివరాలను అక్కడి అధికారులు పలు నిబంధనల కారణంగా ఇంకా వెల్లడించలేదు. టెక్సాస్ పబ్లిక్ సేఫ్టీ డిపార్టుమెంట్ మొత్తం ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందినట్లు నిర్ధారించింది. అయితే ఈ ప్రమాదంలో తప్పు ఎవరిదనేది పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు.

మృతులంతా తెలుగు వారని తెలియడంతో తెలుగు సంఘాలు వెంటనే అధికారవర్గాలను సంప్రదించాయి. వారికి కావాల్సిన సమాచారాన్ని అందించడంతో పాటు మృతదేహాలను భారత్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

You may also like

Leave a Comment