Telugu News » Accident : ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య మొదలైన వివాదం.. చివరికి ప్రాణం తీసింది..!!

Accident : ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య మొదలైన వివాదం.. చివరికి ప్రాణం తీసింది..!!

మద్యం, గంజాయి వంటి వాటికి బానిసైన ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య మొదలైన వివాదం.. చివరికి వారి ప్రాణాలు తీసింది.. హైదరాబాద్ (Hyderabad) పాతబస్తీ, భవానీనగర్‌ (Bhavaninagar)లో చోటు చేసుకొన్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. రైలు పట్టాలపై కొంతమంది గొడవ పడుతున్న సమయంలో సడెన్ గా వచ్చిన రైలు, ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్టు సమాచారం..

by Venu

నగరం నూతన సంవత్సరం వేడుకలకి సిద్దం అవుతోంది. ఇప్పటికే ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చోటు చేసుకోకుండా అధికారులు చర్యలు చేపట్టారు. అయినా అక్కడక్కడా మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డ బ్యాచ్ లు రెచ్చిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదీగాక నగరం మత్తుపదార్థాలకు అడ్డాగా మారిందనే అపవాదు మూటగట్టుకొన్న విషయం తెలిసిందే..

ఈ క్రమంలో మద్యం, గంజాయి వంటి వాటికి బానిసైన ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య మొదలైన వివాదం.. చివరికి వారి ప్రాణాలు తీసింది.. హైదరాబాద్ (Hyderabad) పాతబస్తీ, భవానీనగర్‌ (Bhavaninagar)లో చోటు చేసుకొన్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. రైలు పట్టాలపై కొంతమంది గొడవ పడుతున్న సమయంలో సడెన్ గా వచ్చిన రైలు, ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్టు సమాచారం..

మరోవైపు స్థానికుల నుంచి ప్రమాద సమాచారం అందుకొన్న భవాని నగర్ పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి.. వివరాలు సేకరించారు. ఈ ఘటన తర్వాత మరి కొంతమంది అక్కడ నుంచి పారిపోయినట్టు తెలిపారు. అంతలో అక్కడికి చేరుకొన్న రైల్వే పోలీసులు (Railway Police).. మృతదేహాలను మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు..

You may also like

Leave a Comment