Telugu News » Akunuri Murali: తెలంగాణకు కల్వ కుంట్ల కుటుంబం అంతులేని దు:ఖాన్ని మిగిల్చింది…..!

Akunuri Murali: తెలంగాణకు కల్వ కుంట్ల కుటుంబం అంతులేని దు:ఖాన్ని మిగిల్చింది…..!

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్య వేదిక ఆధ్వర్యంలో ఓటర్ల చైతన్య యాత్రను నిర్వహించారు.

by Ramu
akunuri murali calls upon intellectuals and educated people to unite and throw out the kcr family

మేధావులు, విద్యా వంతులు ఏకమై కేసీఆర్ (KCR) కుటుంబాన్ని తరిమికొట్టాలని ఓటర్లకు మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి (Akunuri Murali) పిలుపు నిచ్చారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్య వేదిక ఆధ్వర్యంలో ఓటర్ల చైతన్య యాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి పాల్గొన్నారు.

akunuri murali calls upon intellectuals and educated people to unite and throw out the kcr family

ఈ సందర్బంగా ఆకునూరి మురళి మాట్లాడుతూ……. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్నర్ మీటింగ్స్ లను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ మీటింగ్స్ ద్వారా ఓటు విలువ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు. ఓటర్లంతా చైతన్య వంతులై అవినీతి ప్రభుత్వాన్ని బొంద పెట్టాలన్నారు.

నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలను వేల కోట్ల కుంభకోణాలతో కల్వకుంట్ల కుటుంబం తన్నుకు పోయిందని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తెలంగాణాకు కల్వ కుటుంబం అంతులేని దుఃఖాన్ని మిగిల్చిందన్నారు. కల్వకుంట్ల కుటుంబ దోపిడీని అరికట్టాలంటే వచ్చే ఎన్నికల్లో ఆ కుటుంబాన్ని ఓడించాలన్నారు.

మేధావులు, విద్యావంతులు ఏకమై కేసీఆర్ కుటుంబాన్ని తరిమికొట్టాలన్నారు. కోదాడలో అన్ని వసతులు ఉన్నాయని చెప్పారు. అయినప్పటికీ ఆసుపత్రి కట్టించ లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అసమర్థ సర్కార్ మనకు వద్దని ఆయన మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ నుంచి విముక్తి కలగనుందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌లకు కాకుండా ఇతర ఏ పార్టీకైనా ఓట్లు వేయాలని ఆయన పిలుపు నిచ్చారు.

You may also like

Leave a Comment