Telugu News » Chidambaram : మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా పి. చిదంబరం.. 2024 ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్‌..!!

Chidambaram : మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా పి. చిదంబరం.. 2024 ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్‌..!!

2024 సార్వత్రిక ఎన్నికల కోసం.. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఈ మ్యానిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో కేంద్ర మాజీ మంత్రులు ఆనంద్ శర్మ, జైరాం రమేష్, శశి థరూర్ లతో పాటు ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చీఫ్ ప్రవీణ్ చక్రవర్తితో పాటు సీనియర్ కాంగ్రెస్ నేత, మణిపూర్ మాజీ డిప్యూటీ సీఎం గైఖాంగమ్, గౌరవ్ గొగోయ్ కమిటీలో ఉన్నారు.

by Venu

అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections).. ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయిన కాంగ్రెస్.. లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీతో నువ్వా.. నేనా.. అన్నట్టు జరుగుతోన్న పోరులో.. కాషాయాన్ని ఢీ కొట్టడానికి కుటమిని సైతం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.. ఇందులో భాగంగా సరికొత్త వ్యూహాలతో హస్తం ముందుకి వెళ్లడానికి ప్రణాళికలు సిద్దం చేసుకొంటుందని ప్రచారం..

ఈ నేపథ్యంలో 2024 లోక్‌సభ ఎన్నికల కోసం మేనిఫెస్టో (Manifesto) కమిటీని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ (Congress).. మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరాన్ని ( Chidambaram) చైర్మన్‌గా నియమించింది. ఈ మేనిఫేస్టో కమిటీలో 16మంది సభ్యులు ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో కన్వీనర్‌గా ఛత్తీస్‌గఢ్‌ మాజీ డిప్యూటీ సీఎం టీఎస్‌ సింగ్‌దేవ్‌.. మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఆనంద్‌ శర్మ, జైరామ్‌ రమేశ్‌, శశిథరూర్‌ ఉన్నట్టు సమాచారం.

మరోవైపు 2024 సార్వత్రిక ఎన్నికల కోసం.. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఈ మ్యానిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో కేంద్ర మాజీ మంత్రులు ఆనంద్ శర్మ, జైరాం రమేష్, శశి థరూర్ లతో పాటు ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చీఫ్ ప్రవీణ్ చక్రవర్తితో పాటు సీనియర్ కాంగ్రెస్ నేత, మణిపూర్ మాజీ డిప్యూటీ సీఎం గైఖాంగమ్, గౌరవ్ గొగోయ్ కమిటీలో ఉన్నారు.

ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి, కె రాజు, ఓంకార్ సింగ్ మార్కం, రంజీత్ రంజన్, జిగ్నేష్ మేవానీ, గుర్దీప్ సప్పల్ ఎన్నికల కోసం పార్టీ ఎజెండాను ఖరారు చేసే కీలక ప్యానెల్‌లో ఇతర సభ్యులుగా ఉన్నారు.. మరోవైపు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభాగాలు అనుసరించిన వ్యూహాలపై రాహుల్‌గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ (BJP)పై విజయం సాధించేందుకు ప్రతి ఓటు కీలకమని పేర్కొన్నారు..

You may also like

Leave a Comment