Telugu News » Bihar : బీహార్‌లో దారుణ ఘటన.. అతి కిరాతకంగా పూజారి హత్య..!!

Bihar : బీహార్‌లో దారుణ ఘటన.. అతి కిరాతకంగా పూజారి హత్య..!!

హత్య చేయబడ్డ పూజారి.. బీజేపీ మాజీ డివిజనల్ అధ్యక్షుడు అశోక్ కుమార్ షా సోదరుడు కావడంతో ఈ ఘటన పొలిటికల్ టర్న్ తీసుకొంది. ఈ హత్యపై బీజేపీ షహజాద్ పూనావాలా స్పందించారు. బీహార్‌లో ఇప్పుడు నితీష్ కుమార్ పాలన కాదు.. జంగిల్ రాజ్ పాలన నడుస్తోందని విమర్శించారు.

by Venu

బీహార్‌ ( Bihar)లో దారుణ ఘటన చోటు చేసుకోంది.. గోపాల్ గంజ్ (Gopal Ganj) జిల్లాలోని దానాపూర్ (Danapur) గ్రామ శివాలయంలో పూజారిగా పనిచేస్తున్న మనోజ్ కుమార్ ని అత్యంత పాశవికంగా హత్య చేశారు. కళ్లను పొడిచి, జననాంగాలను కోసేసిన స్థితితో మృతదేహం లభించడం సంచలనం సృష్టిస్తోంది.. ఆరు రోజుల క్రితం కిడ్నాప్ అయిన పూజారి హత్య స్థానికుల్లో ఆగ్రహావేశాలకు కారణమైంది. దీంతో బీహార్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి..

Murder in Ap: A YCP worker was brutally murdered by throwing pepper in his eyes..!

ఈ క్రమంలో పోలీసులకు, స్థానికులకు మధ్య జరిగిన ఘర్షణ చోటు చేసుకోంది. ఈ గోడవల్లో ఇద్దరు పోలీస్ అధికారులకు గాయాలయ్యాయి. మరోవైపు ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్న ఆందోళనకారులు.. రాళ్లదాడికి పాల్పడ్డారు. హైవేపై ఉన్న పోలీస్ వాహనానికి నిప్పు పెట్టారు. పరిస్థితి విషమించడంతో.. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. గోపాల్ గంజ్ డీఎస్పీ ప్రాంజల్ (DSP Pranjal) సంఘటన స్థలానికి చేరుకోని ఆందోళనకారుల్ని శాంతింప చేశారు.

కాగా హత్య చేయబడ్డ పూజారి.. బీజేపీ మాజీ డివిజనల్ అధ్యక్షుడు అశోక్ కుమార్ షా సోదరుడు కావడంతో ఈ ఘటన పొలిటికల్ టర్న్ తీసుకొంది. ఈ హత్యపై బీజేపీ షహజాద్ పూనావాలా స్పందించారు. బీహార్‌లో ఇప్పుడు నితీష్ కుమార్ పాలన కాదు.. జంగిల్ రాజ్ పాలన నడుస్తోందని విమర్శించారు. ఇండియా కూటమి పాలనలో సాధువులు, పూజారులకు ప్రమాదమని ఆరోపించారు. బీహార్ రాష్ట్రంలో ఎవరూ సురక్షితంగా లేరని వెల్లడించారు..

You may also like

Leave a Comment