Telugu News » Nizamabad : ఆస్తి కోసం కుటుంబాన్ని చంపిన స్నేహితుడు.. వీడు మనిషి మాత్రం కాదు..!!

Nizamabad : ఆస్తి కోసం కుటుంబాన్ని చంపిన స్నేహితుడు.. వీడు మనిషి మాత్రం కాదు..!!

తనకి ఉన్నది చాలక తనది కానీ వాటిమీద ఆశపెంచుకొంటున్న మనిషి క్రూరంగా మారే ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం తాను మనిషి జన్మ ఎత్తానన్న విషయం మరచి ఒక కుటుంబాన్ని అంతం చేసిన ఘటన.. రక్త పిశాచాల ఉదంతాన్ని మరిపిస్తోంది.

by Venu

ఈ భూమి మీద ఎన్నాళ్ళు బ్రతుకుతామో తెలియదు. ఇన్నాళ్ళూ బ్రతుకుతామనే గ్యారంటీ లేదు.. మనిషి తయారు చేసిన వస్తువులకైనా ఇన్నాళ్ళూ పనిచేస్తుందనే గ్యారంటీ లభిస్తోంది కానీ మనుషులకి మాత్రం విలువ లేదు.. గ్యారంటీ లేదన్న విషయం అందరికీ తెలిసిందే.. కానీ ఇది నాది.. నాకే చెందాలి అనే ఆశ మాత్రం చావడం లేదు..

తనకి ఉన్నది చాలక తనది కానీ వాటిమీద ఆశపెంచుకొంటున్న మనిషి క్రూరంగా మారే ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం తాను మనిషి జన్మ ఎత్తానన్న విషయం మరచి ఒక కుటుంబాన్ని అంతం చేసిన ఘటన.. రక్త పిశాచాల ఉదంతాన్ని మరిపిస్తోంది. నిజామాబాద్‌ (Nizamabad) జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన సమాజాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు (Six Member) హత్య (Murder)కు గురయ్యారు. ఆస్తి కోసం వారం రోజుల వ్యవధిలో విడివిడిగా వారందరినీ నిందితుడు దారుణంగా హతమార్చాడు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్తి కోసం మొదట ప్రసాద్ అనే వ్యక్తిని హత్య చేసిన అతడి స్నేహితుడు ప్రశాంత్.. అనంతరం ఆ మృతదేహాన్ని డిచ్‌పల్లి హైవే పక్కన పూడ్చి పెట్టాడు. ఆ తర్వాత ఏమి ఎరుగనట్టు ప్రసాద్‌ ఇంటికి వెళ్లిన ప్రశాంత్.. ప్రసాద్‌ పోలీసుల అదుపులో ఉన్నాడని చెప్పి అతడి భార్యను చంపేశాడు. అనంతరం ఆమె శవాన్ని బాసర గోదావరి నదిలో పడేశాడు. ఇంతటితో ఆగని ఆ రాక్షసుడు.. ప్రసాద్, అతని భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ప్రసాద్ సోదరికి మాయమాటలు చెప్పి ఆమెను కూడా హత్య చేశాడు..

అనంతరం ప్రసాద్ ఇద్దరు పిల్లలను హత మార్చిన ప్రశాంత్.. వారిని పోచంపాడ్ సోన్ బ్రిడ్జి వద్ద కాలువలో పడేశాడు. కామారెడ్డి సదాశివనగర్‌లో ఉంటోన్న ప్రసాద్ సోదరిని సైతం హత్య చేసి కాల్చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు రంగంలోకి దిగారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో ఆరుగురి హత్యోదంతం బయటపడింది. ఈ మేరకు నలుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. కాగా ప్రసాద్ ఇంటి కోసమే ఇంటిల్లిపాదినీ హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు..

You may also like

Leave a Comment