తెలంగాణ (Telangana)లో అధికారుల ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ నెల 30 న జరగనున్న ఎన్నికల కోసం ఇప్పటికే అంతా సిద్దం చేసుకున్న అధికారులు.. ఏర్పాట్లను స్పీడ్ అప్ చేశారు.. మరోవైపు సమయం మించిపోతుండటంతో అభ్యర్థులు సైతం ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. హామీలు, మేనిఫెస్టోలతో ఓటర్లను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.
ఈసీ (EC) కూడా ఈ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడం కోసం నియమాలను కఠినంగా అమలుచేస్తుంది. ఈ క్రమంలో ఓటు వేయడం ఇష్టం లేని అభ్యర్థుల కోసం ఇప్పటికే నోటాను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ నోటా (Nota) కోసం అధికారులు రెండు చోట్లా అదనపు బ్యాలెట్ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా సనత్ నగర్ (Sanat Nagar)..నర్సంపేట (Narsampeta)లో అదనపు బ్యాలెట్ యూనిట్ ను ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
మరోవైపు సనత్ నగర్ లో 18 మంది నామినేషన్లు వేయగా.. ఇద్దరు ఉపసంహరించుకున్నారు. నర్సంపేటలోనూ 16 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ఒక్కో ఈవీఎంలో 16 గుర్తులకే ఛాన్స్ ఉండటంతో అంతకు మించితే మరో యూనిట్ ను ఎన్నికల అధికారులు కేటాయిస్తారు. అయితే ఐదేళ్ల క్రితం గరిష్ఠంగా నాలుగు యూనిట్లతో 64 గుర్తుల వరకు ఎన్నిక నిర్వహించే అవకాశం ఉండేది. అంతకు మించితే కంట్రోల్ యూనిట్ తీసుకునేది కాదు..
కానీ.. 2019 నుంచి ప్రవేశ పెట్టిన ఎం-టీ రకం ఈవీఎంతో ఆ సమస్యకు పరిష్కారం దొరికింది. వీటిలో ఒక్కో కంట్రోల్ యూనిట్ కు.. 24 ఈవీఎం యూనిట్లను అమర్చేలా సాంకేతికతను డెవలప్ చేశారు. దీన్నిబట్టి చూస్తే ఒక నియోజకవర్గంలో 384 మంది ఎన్నికల బరిలో ఉన్నా ఎన్నికల నిర్వహణ సాధ్యం అవుతుంది. మరోవైపు 2019 లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి 185 మంది అభ్యర్థులు బరిలో నిలవగా ఎం-టీ రకం ఈవీఎంలను ఉపయోగించి ఎన్నికలు నిర్వహించారు.



మరో సారి వీరి మధ్య నిప్పు రాజుకుంది. ఎన్నికల ప్రచారంలో వివేక్ వెంకట స్వామి డబ్బులు పంచుతున్నారని ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే బాల్క సుమన్.. మంచిర్యాల జిల్లాలో ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ని కలిసి ఫిర్యాదు చేశారు. వివేక్ పక్కన ఉన్న వారి అకౌంట్స్ లోకి డబ్బులు జమ చేస్తూ.. చెన్నూరు నియోజకవర్గం ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని తెలిపారు.
మరోవైపు ఎర్రుపాలెం మండలం తెల్లపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారం (Election-Campaign) నిర్వహించిన భట్టి విక్రమార్క (Bhatti Vikramarka).. బీఆర్ఎస్ పై పలు విమర్శలు చేశారు. తెలంగాణలో పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఏంటో శ్వేత పత్రం విడుదల చేయాలని కేసీఆర్ కు సవాల్ విసిరారు.
మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) తన నియోజక వర్గంలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం (Election Campaign)లో బీఆర్ఎస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్థిని మరచిన బీఆర్ఎస్ కు బుద్ధి రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నట్టు వెంకటరెడ్డి తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ (KCR)ని గద్దె దింపాలని ధర్వేశిపురం నుంచి మంచినీళ్ల బావి వరకు కోటి రూపాయలతో రోడ్డు వేయించానని పేర్కొన్నారు..