Telugu News » Bandi Sanjay : అసదుద్దీన్ కు దేవుళ్లంటే చులకన.. పట్టు కోల్పోతున్నామనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు…!

Bandi Sanjay : అసదుద్దీన్ కు దేవుళ్లంటే చులకన.. పట్టు కోల్పోతున్నామనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు…!

రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని వివాదాస్పదం చేసే కుట్రలో భాగంగా ఓవైసీ అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.

by Ramu
bandy-sanjay

ఏఐఎంఐఎం చీఫ్ ((AIMIM Chief) , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi)పై బీజేపీ (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ (MP )బండి సంజయ్ (Bandi Sanjay) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసదుద్దీన్ కు హిందూ దేవుళ్లంటే చులకన అని విమర్శించారు.

bandy-sanjay

 

రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని వివాదాస్పదం చేసే కుట్రలో భాగంగా ఓవైసీ అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. శ్రీరామ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య నుంచి వచ్చిన శ్రీ రాముడి అక్షింతలను కరీంనగర్ చైతన్యపురిలో ఇంటింటికీ పంపిణీ చేసే కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలువురి ఇండ్లకు వెళ్లి స్వయంగా శ్రీరాముడి అక్షింతలను వారికి సంజయ్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ….పట్టు కోల్పోతున్నామనే భయంతోనే ఇలాంటి పనికిమాలిన కామెంట్స్ ఓవైసీ చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోవొద్దని సూచించారు.

ఈ నెల 22న జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. రాజకీయాలకు అతీతంగా ఈనెల 22న అయోధ్యలో జరిగే దివ్యమైన, భవ్యమైన రామ మందిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు ఆరోజు సాయంత్రం ప్రతి హిందువు తమ ఇండ్లల్లో దీపాలు వెలిగించాలని కోరారు. హిందూ మతం ఐక్యతను చాటుదామని పిలుపునిచ్చారు.

You may also like

Leave a Comment