Telugu News » Bihar Govenment: బిహార్ సర్కార్‌ కీలక నిర్ణయం.. రిజర్వేషన్లు 65శాతానికి పెంపు..!

Bihar Govenment: బిహార్ సర్కార్‌ కీలక నిర్ణయం.. రిజర్వేషన్లు 65శాతానికి పెంపు..!

రిజర్వేషన్లను 50 నుంచి 65 శాతానికి పెంచాలని నిర్ణయించింది. 10 శాతం ఈడబ్ల్యూఎస్(EWS) రిజర్వేషన్లను కలుపుకొని మొత్తం కోటాను 75 శాతానికి పెంచాలని నిర్ణయిస్తూ బిహార్ సీఎం నీతీశ్ కుమార్‌(Cm Nithish Kumar) అసెంబ్లీలో ప్రతిపాదన ప్రవేశపెట్టారు.

by Mano
nithish

బిహార్‌ సర్కార్ (Bihar Govenment) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లను 50 నుంచి 65 శాతానికి పెంచాలని నిర్ణయించింది. 10 శాతం ఈడబ్ల్యూఎస్(EWS) రిజర్వేషన్లను కలుపుకొని మొత్తం కోటాను 75 శాతానికి పెంచాలని నిర్ణయిస్తూ బిహార్ సీఎం నీతీశ్ కుమార్‌(Cm Nithish Kumar) అసెంబ్లీలో ప్రతిపాదన ప్రవేశపెట్టారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లును అమల్లోకి తెలిపారు.

nithish

ఈ నివేదిక ప్రకారం.. బిహార్‌లో మొత్తం 2 కోట్ల 97లక్షల కుటుంబాలు ఉండగా.. 94 లక్షల కుటుంబాలు పేదరికంలో ఉన్నాయి. ఓబీసీలు, ఈబీసీలు, 60 శాతానికి పైగా ఉంది. అందులో ఈ శాతం ఎస్సీ, ఎస్టీలలో 43 శాతం మంది పేదరికంలోనే ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది. బీసీల్లో 33 శాతం.. అగ్రవర్ణాల్లో 25శాతానికిపైగా, అగ్రవర్ణాలు 10 శాతానికి పైగా ఉన్నారు. మరోవైపు 50 లక్షల మంది ఉపాధి, విద్య కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లినట్లు పేర్కొంది.

బిహార్‌లో రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచాలని ఆ రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. బిహార్‌లో ఇటీవల చేపట్టిన కులగణన నివేదికను తాజా అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. బిహార్‌లో మూడో వంతుకుపైగా కుటుంబాలు పేదరికంలో మగ్గుతున్నట్లు ఈ నివేదికలో తేలింది. 34.13 శాతం కుటుంబాలకు నెలవారీ ఆదాయం 6 వేలు, అంతకంటే తక్కువగా ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది.

బలహీనవర్గాలకు చెందిన వారికి న్యాయ సర్వీసులు, ప్రభుత్వ న్యాయ కళాశాలలు, యూనివర్సిటీల్లో 10శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు నితీశ్ ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. కుల గణనకు సంబంధించిన నివేదికను బిహార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కొన్ని గంటల్లోనే ప్రభుత్వం ఈ రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని తీసుకురావడం గమనార్హం. దీనిపై నిపుణులతో సంప్రదింపుల తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎం నితీష్‌కుమార్ తెలిపారు.

 

You may also like

Leave a Comment