Telugu News » BJP MP GVL: తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి కారణమదే: బీజేపీ ఎంపీ జీవీఎల్

BJP MP GVL: తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి కారణమదే: బీజేపీ ఎంపీ జీవీఎల్

తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ పార్టీ(Congress Party) విజయానికి కారణం కేవలం బీఆర్ఎస్‌ పార్టీ(BRS Party)పై ఉన్న వ్యతిరేకత మాత్రమేనని బీజేపీ ఎంపీ(BJP MP) జీవీఎల్ నరసింహ రావు(GVL Narsimharao) అన్నారు.

by Mano
BJP MP GVL: Reason for Congress's victory in Telangana: BJP MP GVL

తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ పార్టీ(Congress Party) విజయానికి కారణం కేవలం బీఆర్ఎస్‌ పార్టీ(BRS Party)పై ఉన్న వ్యతిరేకత మాత్రమేనని బీజేపీ ఎంపీ(BJP MP) జీవీఎల్ నరసింహ రావు(GVL Narsimharao) అన్నారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.

BJP MP GVL: Reason for Congress's victory in Telangana: BJP MP GVL

భారతీయ జనతాపార్టీ(BJP) 2024లో 350 సీట్లకు పైగా గెలుపొంది మోడీ మరోసారి ప్రధాని అవుతారనే దానికి మూడు రాష్ట్రాల్లో(మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్) వచ్చిన ప్రజాతీర్పే నిదర్శనమన్నారు. మోడీ ప్రభుత్వం విశ్వసనీయత, అవినీతి రహిత పాలన ఈ మూడు రాష్ట్రాల్లో ఘన విజయానికి కారణమన్నారు.

మధ్యప్రదేశ్‌లో ఘన విజయానికి కారణం డబుల్ ఇంజన్ ప్రభుత్వమేనని ఎంపీ జీవీఎల్ అన్నారు. అదేవిధంగా ఛత్తీస్‌గఢ్‌ బీజేపీ గెలుపులో మహిళలు, గిరిజనుల పాత్ర కీలకమని తెలిపారు. తెలంగాణలో బీజేపీ ఓట్ల శాతం ఏడు నుంచి 14కు గణనీయంగా పెరిగిందని ఎంపీ వెల్లడించారు. మూడు రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్, అంచనాలకు అతీతంగా బీజేపీకి నిశ్శబ్ద ఓటింగ్ నమోదైందని తెలిపారు.

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కచ్చితంగా 95 శాతానికి పైగా స్థానాలను బీజేపీ సాధించనుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ హస్తం భస్మాసురహస్తమని ఆయన ఆరోపించారు. త్వరలో ఇండియా కూటమి కార్యాలయాలు మూసేసుకోవచ్చని ఎంపీ జీవీఎల్ ఎద్దేవా చేశారు.

You may also like

Leave a Comment