Telugu News » Soyam : ఎమ్మెల్యే అభ్యర్థులపై ఆసక్తికర వ్యాఖ్యలు..!

Soyam : ఎమ్మెల్యే అభ్యర్థులపై ఆసక్తికర వ్యాఖ్యలు..!

తెలంగాణలో ఎంపీలందరూ ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని హైకమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని తెలిపారు. హై కమాండ్ నిర్ణయాన్ని స్వీకరిస్తూ బోథ్ని యోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.

by Venu

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రేపు నిర్వహించే అమిత్ షా సభకు ప్రజలు భారీగా తరలిరావాలని ఎంపీ సోయం బాపురావు పిలుపునిచ్చారు. సోమవారం ఇచ్చోడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

షా రాకతో జిల్లాలో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. రైల్వే లైన్, పొడు భూముల సమస్యలు, ఆదివాసీల సమస్యలు పరిష్కారం కానున్నట్లు పేర్కొన్నారు.

అన్ని వర్గాల ప్రజలు తరలిరావాలని కోరారు. తెలంగాణలో ఎంపీలందరు ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని హైకమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని తెలిపారు. హై కమాండ్ నిర్ణయాన్ని స్వీకరిస్తూ బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.

కొన్నాళ్లుగా సోయం పార్టీ మారుతున్నట్టు తెగ ప్రచారం జరుగుతోంది. తాజా వ్యాఖ్యలతో అదంతా ప్రచారమే అని తేలిపోయింది.

You may also like

Leave a Comment