లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ (BJP) సర్కార్ ఆసక్తికర నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ (Central Cabinet) కీలక నిర్ణయం తీసుకొంది. కేబినెట్ భేటీ అనంతరం ఢిల్లీ (Delhi)లో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, మీడియాకు కేటినెట్ నిర్ణయాలకు వెల్లడించారు.

అలాగే ఈ రెండు కారిడార్ల దూరం 20.762 కిలోమీటర్లు ఉంటుందని తెలిపారు..మరోవైపు ఈ ప్రాజెక్టు మార్చి 2029 నాటికి పూర్తవుతుందన్న కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్.. లజపత్ నగర్ నుంచి సాకేత్ జీ-బ్లాక్, ఇందర్ లోక్ నుంచి ఇంద్రప్రస్థ వరకూ వీటిని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.. ఈ కొత్త మెట్రో లైన్ సిల్వర్, మెజెంటా, పింక్ వైలెట్ లైన్లను కనెక్ట్ చేయనుందన్నారు. మొత్తం 8 స్టేషన్లను నిర్మించనుండగా.. ఇందర్ లోక్ నుంచి ఇంద్రప్రస్థ వరకూ 12.377 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ ఉండనుందని పేర్కొన్నారు..