Telugu News » Chalavadi Narayanaswamy : దేశాన్ని విడగొట్టాలని చూస్తున్న కాంగ్రెస్.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!

Chalavadi Narayanaswamy : దేశాన్ని విడగొట్టాలని చూస్తున్న కాంగ్రెస్.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!

కేంద్రం చిన్న చూపు చూడటం వల్ల ప్రతి దశలోనూ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని ఎంపీ సురేశ్ ఆరోపించారు. జీఎస్టీ, కస్టమ్స్, డైరెక్టు ట్యాక్స్ ఇలా పన్నులు ఏవైనా మా వాటాలు మాకు చెల్లించవలసిందే అని డిమాండ్ చేశారు.

by Venu

మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కొద్దిసేపటికే కర్ణాటక (Karnataka) కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ కుమార్ (MP DK Suresh Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం దక్షిణ భారతదేశానికి అభివృద్ధి నిధులను అందకుండా చేసిందని మండిపడ్డారు. ఈ సమస్యను పరిష్కరించకుంటే దక్షిణాది రాష్ట్రాలను ప్రత్యేక దేశంగా ప్రకటించాలనే డిమాండ్ తెరమీదికి వస్తుందని హెచ్చరించారు.

కేంద్రం చిన్న చూపు చూడటం వల్ల ప్రతి దశలోనూ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని ఎంపీ సురేశ్ ఆరోపించారు. జీఎస్టీ, కస్టమ్స్, డైరెక్టు ట్యాక్స్ ఇలా పన్నులు ఏవైనా మా వాటాలు మాకు చెల్లించవలసిందే అని డిమాండ్ చేశారు. మాకు రావలసిన వాటాను ఉత్తరాదిలో పంచిపెడుతున్నారంటూ మండిపడ్డారు.. కాగా నిధుల కేటాయింపు పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి స్పందిస్తూ గతేడాది కార్పొరేట్, ఇతర పన్నుల కింద కర్ణాటక రూ. 2.25 లక్షల కోట్లు చెల్లిస్తే టాక్స్ డివల్యూషన్ కింద కేవలం రూ. 37,252 కోట్లే వచ్చాయన్నారు.

రాష్ట్రం రూ.1.4 లక్షల కోట్లు జీఎస్టీ కింద చెల్లిస్తే రాష్ట్రానికి ఇందులో వాటాగా రూ.13,005 కోట్లే వచ్చాయన్నారు. వివిధ పన్నుల కింద కర్ణాటక గతేడాది రూ.4 లక్షల కోట్లు వసూళ్లు సాధించిందని, కానీ రాష్ట్ర వాటాగా కేవలం రూ.50,257 కోట్లు వచ్చే అవకాశం ఉందని కానీ, కేంద్రం కనీసం రూ.లక్ష కోట్లు కర్ణాటకకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఇప్పటికే కేంద్ర నిధుల్లో తమకు తగిన వాటా రావట్లేదంటూ పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీ వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో వివాదాస్పదంగా మారాయి.

మరోవైపు కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలపై బీజేపీ (BJP) నేత చలవాడి నారాయణస్వామి (Chalavadi Narayanaswamy) మండిపడ్డారు. భారత్‌ ను ఏకం చేసేబదులు ముక్కలు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. దేశం విడగొట్టాలన్నదే కాంగ్రెస్ (Congress) ఆలోచనా విధానమని ఆరోపించారు.. వాళ్లు 1947లో ఇదే చేశారని.. ఓవైపు రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో యాత్ర చేస్తుంటే వీళ్లేమో దేశాన్ని ఉత్తరాది, దక్షిణాదిగా విడగొట్టాలని గోతికాడి నక్కలుగా ఎదురుచూస్తున్నారని విమర్శించారు.

You may also like

Leave a Comment