Telugu News » Chandrababu: త్వరలో మంచి రోజులు వస్తాయి: చంద్రబాబు

Chandrababu: త్వరలో మంచి రోజులు వస్తాయి: చంద్రబాబు

తూర్పుగోదావరి జిల్లా (East Godavari District), రాజమండ్రి(Rajamandri)లో సోమవారం ‘ రా కదలిరా’ బహిరంగ సభ నిర్వహించారు.

by Mano
Chandrababu: Better days will come soon: Chandrababu

ఏపీ ప్రజలకు త్వరలో మంచిరోజులు వస్తాయని టీడీపీ అధినేత(TDP Chief) నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) అన్నారు. తూర్పుగోదావరి జిల్లా (East Godavari District), రాజమండ్రి(Rajamandri)లో సోమవారం ‘ రా కదలిరా’ బహిరంగ సభ నిర్వహించారు.

Chandrababu: Better days will come soon: Chandrababu

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. చంద్రబాబు జిల్లాకు వస్తున్న సందర్భంగా పార్టీ నాయకులు, అభిమానులు, శ్రేణులు పెద్దఎత్తున స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీగా వచ్చారు.

అనంతరం చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రాన్ని కాపాడుకోడానికి ‘రా కదిలి రా’ అని పిలుపిస్తే మహానాడును తలపించే విధంగా సభకు ప్రజలు తరలి వచ్చారంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే జనసేనతో కలిసి పోటీలోకి దిగుతున్నట్లు వెల్లడించారు.

అదేవిధంగా భావితరాల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. త్వరలో మనందరికీ మంచి రోజులు వస్తాయన్నారు. తెలుగుదేశం, జనసేన గెలుపును ఆపడం ఎవరితరం కాదన్నారు చంద్రబాబు. ఒక సైకో పాలన రాష్ట్రంలో జరుగుతోందని, మానసిక రోగి పరిపాలిస్తున్నాడంటూ సీఎం జగన్‌పై ధ్వజమెత్తారు.

You may also like

Leave a Comment