Telugu News » Children sold: 3 రోజుల బిడ్డను రూ. 20 వేలకు అమ్మకానికి పెట్టిన కన్నతల్లి

Children sold: 3 రోజుల బిడ్డను రూ. 20 వేలకు అమ్మకానికి పెట్టిన కన్నతల్లి

మూడు రోజుల వయసున్న బిడ్డను రూ. 20 వేలకు, ఏడు ఏళ్ల వయసున్న బిడ్డను రూ.30 వేలకు అమ్మకానికి పెట్టింది. అయితే ఈ సమాచారం ఐసీడీఎస్ అధికారులకు అందింది.

by Prasanna
children sold

అనారోగ్య సమస్యల (Health Isuues) తో ఇబ్బందులు పడుతున్న ఓ తల్లి ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కెందుకు తన కూతుళ్లను అమ్మకానికి పెట్టింది. ఈ సంఘటన తెలంగాణా (Telangana) లో కామారెడ్డి జిల్లా (Kamareddy Dist)లో చోటు చేసుకుంది.

children sold

children sold

కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డి పేటలో నివాసముంటున్న ఓ మహిళకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారిలో ఒక కూతురు వయసు 7 ఏళ్లు కాగా, మరో కూతురు పుట్టి మూడు రోజులే అయ్యింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆ మహిళకు రెండో కూతురు పుట్టడం సాకడం కష్టమైంది. దీంతో వీరిద్దరిని అమ్మకానికి పెట్టింది.

మూడు రోజుల వయసున్న బిడ్డను రూ. 20 వేలకు, ఏడు ఏళ్ల వయసున్న బిడ్డను రూ.30 వేలకు అమ్మకానికి పెట్టింది. అయితే ఈ సమాచారం ఐసీడీఎస్ అధికారులకు అందింది. దీంతో బిడ్డలను అమ్ముతున్న సమయంలో ఐసీడీఎస్ అధికారులు పోలీసుల సహాయంతో ఆ మహిళను పట్టుకున్నారు. అయితే ఆమె తన బిడ్డలను ఎవరికి అమ్మకానికి పెట్టింది, వారు ఎవరు అనే విషయాలను అధికారులు వెల్లడించలేదు.

కామారెడ్డి జిల్లాలో కొంత కాలంగా పిల్లల విక్రయాలు సాగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో కామారెడ్డ జిల్లాలోనే ఓ సవతి తల్లి ఇద్దరు బాలికలను రాజస్థాన్ కు చెందిన వ్యక్తికి అమ్మడమే కాకుండా, అతనితో పెళ్లి కూడా జరిపించింది. అప్పుడు విషయం తెలుసున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. బాలల సంరక్షణ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు అంటున్నారు.

You may also like

Leave a Comment