Telugu News » Rega Kantha Rao : కేసీఆర్ డబ్బులకి కక్కుర్తి పడి పార్టీ మారిన ఎమ్మెల్యే.. పోదెం వీరయ్య..!!

Rega Kantha Rao : కేసీఆర్ డబ్బులకి కక్కుర్తి పడి పార్టీ మారిన ఎమ్మెల్యే.. పోదెం వీరయ్య..!!

ఐదు పంచాయతీల విషయంలో ఏం పోరాడారని పోదెం వీరయ్య దుయ్యబట్టారు. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి సిగ్గు లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని, అప్పుడు నీ అక్రమ సంపాదన, భూదందాల సంగతి చూస్తామని హెచ్చరించారు.

by Venu

బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే (MLA) రేగా కాంతారావు (Rega Kantha Rao) పై కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యే పోదెం వీరయ్య (Podem Veeraiah) కీలక వ్యాఖ్యలు చేశారు. తన పై చేసిన విమర్శలకు ఘాటుగా సమాధానాలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి డబ్బులకి అమ్ముడు పోయిన నువ్వా నన్ను విమర్శించేదంటూ మండిపడ్డారు. భద్రాచలానికి నువ్వు కానీ, నీ ముఖ్యమంత్రి గాని, నీ పార్టీ గాని ఏం చేశారని ప్రశ్నించారు.

ఐదు పంచాయతీల విషయంలో ఏం పోరాడారని పోదెం వీరయ్య దుయ్యబట్టారు. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి సిగ్గు లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని, అప్పుడు నీ అక్రమ సంపాదన, భూదందాల సంగతి చూస్తామని హెచ్చరించారు. కేసీఆర్ డబ్బులకి కక్కుర్తి పడి పార్టీ మారిన రేగా కాంతారావు, రోజుకు ఒక పార్టీ మారే తెల్ల వెంకట్రావు.. వీరు నన్ను ఓడిస్తారా.. మీకు డబ్బుంటే నాకు ప్రజాబలం ఉందని వ్యాఖ్యానించారు పోదెం వీరయ్య.

ఇదే క్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ పై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేవలం నీ నియోజకవర్గానికి మాత్రమే నిధులు తెచ్చుకుని అభివృద్ధి చేసుకుంటున్న నువ్వు ఒక మంత్రివా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. భద్రాచలం గాలికి వదిలేసిన మీరు ఏ మొహం పెట్టుకొని భద్రాచలం వస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా తెల్లం వెంకటరమణ ప్రశ్నిస్తూ.. గత ఎన్నికల్లో ఓడిపోయిన మీరు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక్కసారైనా ముఖ్యమంత్రిని కలిసి నిధులు అడిగారా అని ప్రశ్నించారు.

You may also like

Leave a Comment