Telugu News » Congress to BRS: బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత..!

Congress to BRS: బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత..!

మహబూబ్ నగర్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత ఎర్ర శేఖర్ జడ్చర్ల కాంగ్రెస్ టికెట్ ఆశించినా ఆయనకు టికెట్ వరించలేదు. దీంతో ఆయన కాంగ్రెస్‌ను వీడి మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.

by Mano
Congress to BRS: A senior Congress leader who has become a member of BRS..!

తెలంగాణ(Telangana)లో అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) నేపథ్యంలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్(Brs), కాంగ్రెస్(Congress), బీజేపీ(Bjp)లు ఇదివరకే తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించాయి. ఈ క్రమంలో పార్టీ టికెట్ ఆశించి భంగపడిన పలువురు నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అయిపోతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు పార్టీ నుంచి టికెట్‌ను ఆశించగా పార్టీ హ్యాండ్ ఇచ్చింది. దీంతో ఆయన కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

Congress to BRS: A senior Congress leader who has become a member of BRS..!

మహబూబ్ నగర్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత ఎర్ర శేఖర్ జడ్చర్ల కాంగ్రెస్ టికెట్ ఆశించినా ఆయనకు టికెట్ వరించలేదు. దీంతో ఆయన కాంగ్రెస్‌ను వీడి మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని ఎర్ర శేఖర్ ప్రకటించారు.

తనకు ఉద్యమ కాలం నుంచి కేసీఆర్‌తో అనుబంధం ఉందన్న ఎర్ర శేఖర్.. మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు కలిసి పనిచేశానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులను పెంచేలా ఆత్మగౌరవంతో బతికేలా అనేక కార్యక్రమాలను కేసీఆర్ చేపట్టారని ఈ సందర్భంగా వెల్లడించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చేపల పంపిణీ, మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల వంటి కార్యక్రమాల వలన గుణాత్మక మార్పు వచ్చిందని, మత్స్య సంపద విపరీతంగా పెరిగిందని ఎర్రశేఖర్ అన్నారు. గతంలో టీడీపీలో ఉన్న ఆయన తొలుత బీజేపీలో చేరారు. కొంతకాలం క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

You may also like

Leave a Comment