Telugu News » Pawan Kalyan : బీసీల నాయకత్వం ఉన్న తెలంగాణ రావాలి..!

Pawan Kalyan : బీసీల నాయకత్వం ఉన్న తెలంగాణ రావాలి..!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నారు. ఇటీవలే గద్దర్ మరణం తనను చాలా బాధించిందని తెలిపారు.

by Ramu
Double engine government should come under the leadership of the prime minister

బీసీ (BC)ల నాయకత్వం ఉన్న తెలంగాణ (Telangana) రావాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నారు. ఇటీవలే గద్దర్ మరణం తనను చాలా బాధించిందని తెలిపారు. జనసేన బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ఓ కారణం ఉందన్నారు. బీసీలకు రాజ్యాధికారం ఇస్తున్నందున ఆ పార్టీకి తాము మద్దతు ఇస్తామన్నారు.

Double engine government should come under the leadership of the prime minister

వికారాబాద్ జిల్లా తాండూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి నేమురు శంకర్ గౌడ్ తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. అన్యాయం జరిగితే తిరగబడతామని తెలిపారు. 2004 నుంచి నేమొరీ శంకర్ గౌడ్ తనతో పోరాటంలో పాల్గొన్నారని చెప్పారు.

శ్రీశైలంలో యురేనియం తవ్వకాలపై ఉద్యమం చేశామని అప్పటి రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ సర్కార్ రావాలని ఆయన అన్నారు. తనకు ఆంధ్రా జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మ నిచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రుణపడి ఉంటానని పవన్ చెప్పారు. ఇటీవల గద్దర్ అన్న మరణం తనను చాలా బాధించిందన్నారు.

మరోవైపు తన నాగర్ కర్నూలు ప్రయాణాన్ని పవన్ కళ్యాణ్ రద్దు చేసుకున్నారు. ఈ మేరకు తాండూర్ సభా వేదిక నుంచి ఆయన ప్రకటన చేశారు. తాండూర్ ప్రజలకు ఏ సమస్య వచ్చినా దానిపై రోడ్డు పైకి వచ్చి పోరాటం చేద్దామని ప్రజలకు ఆయన పిలుపు నిచ్చారు.

You may also like

Leave a Comment