Telugu News » East Godavari: సినిమాకు వెళ్తున్నామని చెప్పి.. గోదావరిలో దూకిన నవదంపతులు..!

East Godavari: సినిమాకు వెళ్తున్నామని చెప్పి.. గోదావరిలో దూకిన నవదంపతులు..!

సినిమాకు వెళ్తున్నామని ఇంట్లో చెప్పిన నవదంపతులు(Newly Married Couple) బలవన్మరణానికి యత్నించారు. అయితే, ఈ ఘటనలో భర్త ఈదుకుంటూ బయటకు రాగా, వధువు మాత్రం గల్లంతైంది.

by Mano
East Godavari: The newlyweds jumped into the Godavari saying they were going to the cinema..!

పెళ్లై వారం రోజులు కూడా కాలేదు.. ఏ కష్టం వచ్చిందో తెలీదు.. సినిమాకు వెళ్తున్నామని ఇంట్లో చెప్పిన నవదంపతులు(Newly Married Couple) బలవన్మరణానికి యత్నించారు. అయితే, ఈ ఘటనలో భర్త ఈదుకుంటూ బయటకు రాగా, వధువు మాత్రం గల్లంతైంది.

East Godavari: The newlyweds jumped into the Godavari saying they were going to the cinema..!

ఈ ఘటన ఏపీ(AP)లోని పశ్చిమగోదావరి (East Godavari) జిల్లాలో చోటుచేసుకుంది. ఉడ్రాజవరం మండలం మోర్తకు చెందిన కే.శివరాకృష్ణకు వడలికి చెందిన కోదాడ సత్యవాణితో ఈనెల 15న వివాహమైంది. ఈ నవ జంట మంగళవారం రాత్రి సినిమాకు వెళ్తున్నామని ఇంట్లో చెప్పి బైక్‌పై బయల్దేరారు.

ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ.. పెనుగొండ మండలం సిద్ధాంతం వంతెనపై నుంచి గోదావరి నదిలోకి దూకారు. అయితే వరుడు ఈదుకుంటూ బయటకు రాగా, వధువు మాత్రం గల్లంతయింది. కుటుంబ సభ్యులు, పోలీసులు ఆమెకోసం గాలింపు చేపట్టారు.

తణుకులోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివరామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామకృష్ణ ఏదో నాటకమాడుతున్నాడని వధువు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెనుగొండ ఎస్సై రమేశ్ తెలిపారు.

You may also like

Leave a Comment