నాగర్ కర్నూలు జిల్లా(Nagar Kurnool District)లోని నల్లమల అడవి(Nallamala Forest)లో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. అమ్రాబాద్ మండలం దోమలపెంట రేంజ్ పరిధిలో మంటలు చెలరేగాయి. కొల్లంపెంట, కొమ్మనపెంట, పల్లెబైలు, నక్కర్లపెంటకు ఈ మంటలు వ్యాపించాయి.
దీంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బందికి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 50 హెక్టార్ల విస్తీర్ణంలో అటవి దగ్ధమైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ అగ్నిప్రమాదంపై అటవీశాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో మంత్రి వారికి కీలక సూచనలు చేశారు.
అడవుల్లో కార్చిచ్చు వ్యాపించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి కొండా సురేఖ అధికారులకు సూచించారు. అదేవిధంగా అడవిలోని జంతువులకు ఎలాంటి హాని కలగకుండా చూడాలన్నారు. దీంతో అధికారులు ఆదిశగా చర్యలు ముమ్మరం చేశారు.