Telugu News » Goods Train: లోకో పైలట్ లేకుండా 70కి.మీ ప్రయాణించిన గూడ్స్..!

Goods Train: లోకో పైలట్ లేకుండా 70కి.మీ ప్రయాణించిన గూడ్స్..!

జమ్మూ నుంచి పంజాబ్(Jammu to Punjab) వైపు 53 వేగన్లతో చిప్ స్టోన్స్‌తో గూడ్స్ రైలు బయల్దేరింది. ఆ సమయంలో రైలులో లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ ఎవరూ లేరని అధికారులు చెప్పుకొచ్చారు.

by Mano
Goods Train: Goods traveled 70 km without loco pilot..!

లోకో పైలట్లు(Loco Pilots) లేకుండానే ఓ గూడ్స్‌ రైలు(Goods Train) దాదాపు 70కి.మీల మేర ప్రయాణించింది. ఆదివారం ఉదయం 7.25 నుంచి 9గంటల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జమ్మూ నుంచి పంజాబ్(Jammu to Punjab) వైపు 53 వేగన్లతో చిప్ స్టోన్స్‌తో గూడ్స్ రైలు బయల్దేరింది.

Goods Train: Goods traveled 70 km without loco pilot..!

డ్రైవర్ చేంజ్ కోసం జమ్మూలోని కథువా రైల్వే స్టేషన్‌(Kathua Railway Station)లో రైలును నిలిపాడు. అయితే, ఆ ప్రదేశం కొంత వాలుగా ఉండడంతో తర్వాత కాసేపటికే ట్రైన్ నెమ్మదిగా కదులుతూ ముందుకు దూసుకుపోయింది. ఆ సమయంలో రైలులో లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ ఎవరూ లేరని అధికారులు చెప్పుకొచ్చారు.

నెమ్మదిగా కదిలిన రైలు ఆ తర్వాత గంటకు 100 కిలోమీటర్ల వేగంతో సుమారు ఐదు స్టేషన్లను దాటింటి. చివరకు పంజాబ్‌లోని ఉంచి బస్సీ రైల్వే స్టేషన్‌లో పట్టాలపై ఇసుక బస్తాలను, చెక్క దిమ్మెలు అడ్డుగా ఉంచి రైలును నిలిపారు. ఈ రైలు ప్రయాణిస్తున్న సమయంలో ట్రాక్ పై ఎదురుగా రైళ్లు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

లోకోపైలట్లు లేకుండా రైలు 70 కిలో మీటర్లు ప్రయాణించినా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తునకు ఆదేశించినట్లు జమ్మూ డివిజినల్ ట్రాఫిక్ మేనేజర్ ప్రతీక్‌ శ్రీవాస్తవ తెలిపారు.

You may also like

Leave a Comment