Telugu News » Harish Rao : నాలుగు రోజులు ఓపిక పట్టండి…. బీఆర్ఎస్‌కు బంగారు పల్లెంలో పెట్టి అధికారం ఇస్తారు….!

Harish Rao : నాలుగు రోజులు ఓపిక పట్టండి…. బీఆర్ఎస్‌కు బంగారు పల్లెంలో పెట్టి అధికారం ఇస్తారు….!

ఆయనకు పనితనం తప్ప పగతనం తెలియదన్నారు. బీఆర్ఎస్ ఓటమి కేవలం తాత్కాలికం మాత్రమేనని తెలిపారు. భవిష్యత్ బీఆర్ఎస్‌దేనన్నారు.

by Ramu

మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ (KCR )కక్ష సాధింపు చర్యలకు పూనుకుని ఉంటే కాంగ్రెస్ నేతలు ఇప్పుడు జైళ్లలో ఉండేవారని అన్నారు. ఆయనకు పనితనం తప్ప పగతనం తెలియదన్నారు. బీఆర్ఎస్ ఓటమి కేవలం తాత్కాలికం మాత్రమేనని తెలిపారు. భవిష్యత్ బీఆర్ఎస్‌దేనన్నారు.

 

తెలంగాణ భవన్‌లో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహాక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా హరీశ్ రావు మాట్లాడుతూ…. ఖమ్మం కాంగ్రెస్‌లో మూడు వర్గాలు ఉన్నాయని తెలిపారు. అందులో ఒకటి వైస్సార్ కాంగ్రెస్ అని, మరొకటీ టీడీపీ కాంగ్రెస్, ఇంకొకటి ఒరిజినల్ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు పెరిగాయన్నారు.

తెలంగాణకు బీఆర్ఎస్ అవసరం లేదంటున్నారని బీజేపీ నేత కిషన్ రెడ్డి అంటున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ లేక పొతే తాము తెలంగాణకు అన్యాయం చేయోచ్చని అనుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఆయన ఆశలు అడియాశలే అవుతాయన్నారు. పార్లమెంట్‌లో ఎక్కువ ప్రశ్నలు అడిగింది బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు అని గుర్తు చేశారు. బీఆర్ఎస్‌ను గెలిపిస్తేనే ఖమ్మం జిల్లాకు మేలు జరుగుతుందన్నారు.

బీఆర్ఎస్ కార్యకర్తల గుండెలు రగులుతున్నాయని, పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలనే కసితో పని చేస్తారని చెప్పారు. నాలుగు రోజులు ఓపిక పట్టండని, మళ్లీ బీఆర్ఎస్‌కు బంగారు పల్లెంలో పెట్టి అధికారం ఇస్తారని వెల్లడించారు. కాంగ్రెస్ అన్నింటికీ వంద రోజుల డెడ్ లైన్ పెడుతోందని విమర్శలు గుప్పించారు.
ఆ వంద రోజుల తర్వాత కాంగ్రెస్‌పై ప్రజలే చీటింగ్ కేసులు పెడతారన్నారు. తాము హైదరాబాద్‌లో ఎక్కువ ఉండబోమని చెప్పారు. మీ కోసం.. మీ దగ్గరకే వస్తామని స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తలు మరియు తెలుగు న్యూస్ కోసమై ఇవి చదవండి…!

You may also like

Leave a Comment