Telugu News » Kadapa Murder : స్నేహితుడే యముడు అయ్యాడు.. !!

Kadapa Murder : స్నేహితుడే యముడు అయ్యాడు.. !!

భవానీశంకర్‌, మల్లికార్జున్‌ ఇద్దరు స్నేహితులని.. వివాహేతర సంబంధం విషయంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసినట్టు సమాచారం. కాగా భవానీశంకర్‌ ను హత్యమార్చాలనే ఉద్దేశంతో మల్లికార్జున్‌ ఫోన్‌ చేసి ఎల్‌ఐసీ కార్యాలయానికి రమ్మని పిలిచినట్టు తెలుస్తుంది.

by Venu
Murder in Ap: A YCP worker was brutally murdered by throwing pepper in his eyes..!

ప్రతి గడప దీపావళికి ముస్తాబవుతుంటే కడప (Kadapa)లో విషాదం నెలకొంది. స్థానికంగా ఉన్న ఎల్ఐసీ (LIC) ప్రధాన కార్యాలయంలో ఓ యువకుని హత్య కలకలం రేపుతుంది. కడప ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 14వ డివిజన్‌ వాలంటీర్‌ (Volunteer)గా పనిచేస్తున్న భవానీశంకర్‌ ను అదే కార్యాలయంలో డిజిటలైజేషన్‌ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న మల్లికార్జున్‌ (Mallikarjun) అనే వ్యక్తి దారుణంగా హత్యచేశాడు.

Murder in Ap: A YCP worker was brutally murdered by throwing pepper in his eyes..!

అయితే భవానీశంకర్‌, మల్లికార్జున్‌ ఇద్దరు స్నేహితులని.. వివాహేతర సంబంధం విషయంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసినట్టు సమాచారం. కాగా భవానీశంకర్‌ ను హత్యమార్చాలనే ఉద్దేశంతో మల్లికార్జున్‌ ఫోన్‌ చేసి ఎల్‌ఐసీ కార్యాలయానికి రమ్మని పిలిచినట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలో భవానీ శంకర్‌ అక్కడికి చేరుకోగానే.. మల్లికార్జున్‌ తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడికి పాల్పడగా.. భవానీ సంఘటన స్థలంలో మృతి చెందినట్టు సమాచారం. మరోవైపు హత్య జరిగిన విషయం తెలుసుకున్న కడప డీఎస్పీ షరీఫ్‌ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్టు ప్రాధమిక సమాచారం..

You may also like

Leave a Comment