Telugu News » Kaleshwaram : బీఆర్ఎస్ మెడకి చుట్టుకుంటున్న కాళేశ్వరం అవినీతి.. ఎల్‌అండ్‌టీ సంచలన లేఖ..!!

Kaleshwaram : బీఆర్ఎస్ మెడకి చుట్టుకుంటున్న కాళేశ్వరం అవినీతి.. ఎల్‌అండ్‌టీ సంచలన లేఖ..!!

గతంలో ఇంజినీర్లు చేసిన ప్రకటనకు ప్రస్తుతం నిర్మాణ సంస్థ చేస్తున్న ప్రకటనకు పొంతన లేక పోవడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో మరో సారి ఈ అంశం వివాదాస్పదమవుతోంది. మరోవైపు బ్యారేజీ కుంగిన చోట పిల్లర్లకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి కాఫర్ డ్యాం నిర్మాణం చేపట్టాల్సి ఉంది.

by Venu
Medigadda Barrage

కాళేశ్వరం (Kaleshwaram) మేడిగడ్డ బ్యారేజీ అంశం పై వివాదం ముదురుతోన్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం అవినీతి పై కీలక సాక్ష్యాలు సేకరించే పనిలో ఉన్నట్టు సమాచారం.. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీ విషయంలో ఎల్‌అండ్‌టీ ప్రాజెక్ట్ షాకిచ్చింది. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ప్రాంతం పునరుద్ధరణ బాధ్యత తమది కాదని ఈఎన్సీకి లేఖ రాసింది.

మేడిగడ్డ (Medigadda) బ్యారేజీలో కుంగిన ప్రాంతం రిపేర్‌కు అయ్యే ఖర్చు మొత్తం భరించడంతో పాటు అనుబంధ ఒప్పందం చేసుకుంటేనే ముందుకెళ్తామని సంస్థ లేఖలో పేర్కొంది. మరోవైపు గతంలో ప్రాజెక్ట్ ఇంజినీర్లు ఇందుకు భిన్నంగా ప్రకటన చేశారు. బ్యారేజీ కుంగిన సమయంలో నిర్వహణ గడువు ఇంకా ఉందని, పునరుద్ధరణ ఖర్చు మొత్తం నిర్మాణ సంస్థే భరిస్తుందని వెల్లడించారు.

అయితే గతంలో ఇంజినీర్లు చేసిన ప్రకటనకు ప్రస్తుతం నిర్మాణ సంస్థ చేస్తున్న ప్రకటనకు పొంతన లేక పోవడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో మరో సారి ఈ అంశం వివాదాస్పదమవుతోంది. మరోవైపు బ్యారేజీ కుంగిన చోట పిల్లర్లకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి కాఫర్ డ్యాం నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇందుకు రూ.55.75 కోట్లు ఖర్చు అవుతుందని, ఎల్‌అండ్‌టీ ఈ నెల 2న కాళేశ్వరం ఈఎన్సీ వెంకటేశ్వర్లు (Venkateshwar)కు లేఖ రాసింది.

మరోవైపు మేడిగడ్డ బ్యారేజీ పునురుద్ధరణకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాలని లేఖలో ఎల్‌అండ్‌టీ స్పష్టం చేయడంతో మరోసారి ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ (BRS) కీలక నేతలు సైతం నిర్మాణ సంస్థ పునరుద్ధరణ పనులు చేపడుతుందని.. ఆందోళన చెందాల్సిన పని లేదని ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే తాజాగా ఎల్‌అండ్‌టీ పేర్కొన్న లేఖతో గులాబీ పార్టీ చిక్కుల్లో పడినట్లయిందని అనుకొంటున్నారు..

You may also like

Leave a Comment