Telugu News » Kaleswaram : కదులుతున్న కాళేశ్వరం స్కామ్.. నిజమే చెప్పినట్టు వెల్లడించిన అధికారులు..!!

Kaleswaram : కదులుతున్న కాళేశ్వరం స్కామ్.. నిజమే చెప్పినట్టు వెల్లడించిన అధికారులు..!!

ప్రభుత్వం నుంచి ముఖ్యమైన సమాచారం కోరితే ఇప్పటికీ ఇవ్వలేదని అధికారులు ఆరోపించారు. అయితే బ్యారేజిని ఫ్లోటింగ్‌ స్ట్రక్చర్‌గా డిజైన్‌ చేశారు. కానీ నిర్మాణం మాత్రం దీని ప్రకారం జరగలేదని తెలిపారు. ఎగువన, దిగువన కట్‌ ఆఫ్‌ వాల్‌ సీకెంట్‌ పైల్స్‌ కింద రాయి వరకు తీసుకెళ్లడం వల్ల బ్యారేజీపై ఒత్తిడిలో మార్పు వచ్చిందన్నారు.

by Venu
Kaleswaram Project Defects

తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు.. నవ్వులపాలవుతుందని ఆరోపణలు వస్తున్నాయి.. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ప్రాజెక్ట్ పై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ కూడా మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) డ్యామేజ్ గురించి సమగ్ర విచారణ జరిపి కీలక ఆధారాలు సేకరించింది. కానీ అవి నిరాధార ఆరోపణలు అంటూ వస్తున్న ప్రచారాలపై నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ స్పందించింది.

Kaleswaram Project Defects

కాళేశ్వరం (Kaleswaram) ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్స్ కుంగడానికి గల కారణాలను వాస్తవాలను పరిగణనలోకి తీసుకొనే చెప్పామని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (National Dam Safety Authority) తెలిపింది. ప్రాజెక్టు ప్రణాళిక, డిజైన్‌, క్వాలిటీ కంట్రోల్‌, నిర్వహణలో లోపాలున్నాయని తేల్చిచెప్పింది. నివేదికలో తాము పేర్కొన్న అంశాలకు రాష్ట్రం సమాధానం ఇవ్వలేదని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌ సంజయ్‌కుమార్‌ సిబల్‌ తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌లో కుంగిన వంతెనను, దెబ్బతిన్న పిల్లర్స్‌ను పరిశీలించిన నిపుణుల కమిటీ.. అందులో ఉన్న లోపాలతో నివేదికను తయారు చేశారు. మరోవైపు తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దీనిపై వివరణ ఇస్తూ పలు ఆరోపణలు చేశారు. అంశాలవారీగా సమాధానమిచ్చారు. ఈ విషయంపై నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ తిరిగి సమాధానమిచ్చింది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్స్‌ కుంగడంపై మేం పేర్కొన్న అంశాలకు తెలంగాణ సమాధానం ఇవ్వలేదని ఆరోపించింది.

మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యాలకు గల కారణాలపై సమగ్ర పరిశీలన చేపట్టాలని సూచించాం. ప్లానింగ్‌, డిజైన్‌, క్వాలిటీ కంట్రోల్‌ ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ లోపాలు ఉన్నట్టు తెలిపాం.. బ్యారేజీ రాప్ట్‌ కదలడం వల్ల పగుళ్లు ఏర్పడ్డట్టు వివరించాము.. వైఫల్యానికి గల కారణాలను చెప్పి సాంకేతిక కారణాలను తెలుసుకొనేందుకు సమగ్ర పరిశీలన చేయమన్నాం. దీనివల్ల సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఉద్దేశ్యంతో నిజాలను పరిగణనలోకి తీసుకొని చెప్పాం తప్ప, నిరాధార ఆరోపణలు చేయలేదని అధికారులు సమాధానం ఇచ్చారు.

మరోవైపు ప్రభుత్వం నుంచి ముఖ్యమైన సమాచారం కోరితే ఇప్పటికీ ఇవ్వలేదని అధికారులు ఆరోపించారు. అయితే బ్యారేజిని ఫ్లోటింగ్‌ స్ట్రక్చర్‌గా డిజైన్‌ చేశారు. కానీ నిర్మాణం మాత్రం దీని ప్రకారం జరగలేదని తెలిపారు. ఎగువన, దిగువన కట్‌ ఆఫ్‌ వాల్‌ సీకెంట్‌ పైల్స్‌ కింద రాయి వరకు తీసుకెళ్లడం వల్ల బ్యారేజీపై ఒత్తిడిలో మార్పు వచ్చిందన్నారు.

మరోవైపు సీకెంట్‌ పైల్స్‌కు సంబంధించి క్వాలిటీ కంట్రోల్‌ డేటా లేదు. సిమెంట్‌ కాంక్రీట్‌ బ్లాక్స్‌, లాంచింగ్‌ ఆఫ్రాన్స్‌ తనిఖీ చేయడం కానీ, నిర్వహణ చేయడం కానీ జరగలేదు. ప్రాజెక్టు డీపీఆర్‌ పరిశీలన సమయంలో డిజైన్‌ను కేంద్రజలసంఘం అప్రయిజల్‌ చేయలేదు. రాష్ట్రంలోని సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఓ) ఇచ్చిన సర్టిఫికెట్‌ను పరిగణనలోకి తీసుకొన్నామని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ తాజా లేఖలో పేర్కొంది.

You may also like

Leave a Comment