Telugu News » Kishan Reddy : దరఖాస్తుల పేరిట కాలక్షేపం చేస్తోంది…. కాంగ్రెస్ పై కిషన్ రెడ్డి ఫైర్…!

Kishan Reddy : దరఖాస్తుల పేరిట కాలక్షేపం చేస్తోంది…. కాంగ్రెస్ పై కిషన్ రెడ్డి ఫైర్…!

అభయహస్తం పేరిట కాంగ్రెస్ (Congress) సర్కార్ తీసుకుంటున్న అప్లికేషన్ల విషయంలో ఏదో మతలబు ఉందని అన్నారు. రైతు భరోసాకు కావాల్సిన డేటా ప్రభుత్వం దగ్గర ఉందని వెల్లడించారు.

by Ramu
kishan reddy fire on Cm revanth reddy

దరఖాస్తుల (Applications) పేరితో కాంగ్రెస్ ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అభయహస్తం పేరిట కాంగ్రెస్ (Congress) సర్కార్ తీసుకుంటున్న అప్లికేషన్ల విషయంలో ఏదో మతలబు ఉందని అన్నారు. రైతు భరోసాకు కావాల్సిన డేటా ప్రభుత్వం దగ్గర ఉందని వెల్లడించారు. మరి అలాంటప్పుడు మళ్లీ దరఖాస్తుల కోసం ఎందుకు తిరగాలని ప్రశ్నించారు.

kishan reddy fire on Cm revanth reddy

దరఖాస్తుల పేరిట ప్రజలను అయోమయానికి గురి చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఆ దరఖాస్తులు నింపడంలో ఉన్న ఆంతర్యం ఏంటో అర్థం కావడం లేదని చెప్పారు. ఉపాధి హామీ పథకం కార్డ్ ఎవరి దగ్గర ఉందో ఆ డేటా కూడా ప్రభుత్వం దగ్గర ఉందన్నారు. ఉద్యమ సమయంలో ఎవరిపై కేసులు నమోదు అయ్యాయో ప్రభుత్వం దగ్గర పూర్ది డేటా ఉందని గుర్తు చేశారు.

ఇదంతా పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రజలను తిప్పుకోవడానికి, వారిని ఇబ్బంది పెట్టడానికి ఉద్దేశించిందే తప్ప మరొకటి కాదని ఆరోపించారు. ఇందులో కేవలం రాజకీయం తప్ప చిత్తశుద్ది లేదని మండిపడ్డారు. గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించి రేషన్ కార్డ్ ఇవ్వలేదని చెప్పారు. ఈ విషయం తెలిసి కూడా రేషన్ కార్డ్ జత చేయమనడం ఎందుకు? అని ప్రశ్నించారు.

2,500 రూపాయలు ఎవరికి ఇస్తారు? బీపీఎల్ ఫ్యామిలీ కి ఇస్తారా? డేటా ఉంది కదా? అని ప్రశ్నించారు. దరఖాస్తు ఫామ్స్ లను బ్లాక్‌లో కొనుక్కోవాల్సి వస్తోందని ఫైర్ అయ్యారు. దరఖాస్తు అవసరం లేకుండానే ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. మోడీ మెడిసిన్ ఎక్స్ పైర్ అయిందని రేవంత్ రెడ్డి అంటున్నారని అన్నారు. ఆయన ఆ మెడిసిన్ ఎప్పుడు వేసుకున్నారో అని ఎద్దేవా చేశారు.

రాహుల్ గాంధీ ఉన్నన్ని రోజులు ఆ మెడిసిన్ రిజెక్ట్ కాదన్నారు. ప్రపంచం మొత్తానికి మోడీ మెడిసిన్ సంజీవని లాంటిదన్నారు. రాహుల్ గాంధీ మెడిసిన్ రిజెక్ట్ అయిందన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎవరి మెడిసిన్ ఎక్స్పైర్ అయిందో అందరికీ తెలుసని పేర్కొన్నారు. గజ దొంగల పాలిట యముడు నరేంద్ర మోడీ అని అన్నారు. కుటుంబ పార్టీలకు, అవినీతి పార్టీలకు వ్యతిరేకంగా ఫార్మా సిటీ ఎత్తెస్తమని గతంలో చెప్పిన వ్యక్తి మళ్ల ఫార్మా సిటీ ఉంటుందని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

15 రోజుల్లో కాంగ్రెస్ యూటర్న్ ఎందుకు తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఫార్మా కంపెనీల లాబియింగ్ లొంగిపోయారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలవలేదన్నారు. కేవలం బీఆర్ఎస్ ఓడి పోయిందన్నారు.. కాళేశ్వరం విషయంలో న్యాయ విచారణతో పాటు సీబీఐ విచారణ చేయించాలని కోరానని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ఎగిరెగిరి పడుతున్నారని ధ్వజమెత్తారు.

ఈ సీఎం గతంలో ఎంపీగా ఉన్న సమయంలో ఆధారాలన్నీ తన దగ్గర ఉన్నాయని , సీబీఐకి ఉత్తరం రాస్తున్న అని చెప్పుకొచ్చారన్నారు. రాశాడో లేదో తెలియదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘సీఎం కుటుంబంతో వ్యాపార భాగస్వామ్యం ఎవరికి ఉందో అందరికి తెలుసు. బీఆర్ఎస్ చేసేదేమీ లేదు, సాధించిదేమీ లేదు. నామ రూపల్లేకుండా పోతుంది. నేను కేసీఆర్ బినామీ కాదు. వాళ్లే బినామీలు’అని అన్నారు.

‘ఎంపీగా ఉనప్పుడు సీబీఐ విచారణకు వాళ్లకు అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది. కేవలం నెల రోజుల్లోనే వాళ్లు అహంకారం తలకెక్కింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ పేరుతో కాలయాపన చేసి కేసీఆర్ ను కాపాడలనుకుంటూ చేసేదేమీ లేదు. కాళేశ్వరంలో కమిషన్ తీసుకుంటే విచారణ చేయించు. లంకె బిందెలు ఉన్నాయని వస్తె ఇక్కడ చిప్ప ఉందని రేవంత్ అన్నారు. లంకె బిందల కోసం వచ్చావా? ప్రధాని నీ పట్టుకొని గజ దొంగ అంటావా? 12 లక్షల కోట్ల కుంభకోణం చేసింది సోనియా గాంధీ నాయకత్వంలో నీ ప్రభుత్వము కాదా?’ అని ప్రశ్నించారు. అయోధ్య రామ మందిరం హిందువుల అచంచల విశ్వాసానికి ప్రతీక, మన జాతికి చిహ్నం అని వెల్లడించారు.

You may also like

Leave a Comment