Telugu News » KTR : మొండి చేయి కాంగ్రెస్ కు ఓటు వేస్తే కరెంట్ కష్టాలు తప్పవు…..!

KTR : మొండి చేయి కాంగ్రెస్ కు ఓటు వేస్తే కరెంట్ కష్టాలు తప్పవు…..!

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఏడాదికి ఒక ముఖ్యమంత్రి మారుతారని చెప్పారు.

by Ramu
KTR Fire on Congress party

కాంగ్రెస్ (Congress) ఒక చచ్చిన పాము అని మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. వ్యారంటీ లేని కాంగ్రెస్ గ్యారెంటీ ఎలా ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. మొండి చేయికి ఓటు వేస్తే మళ్లీ కరెంట్ కష్టాలు తప్పవని పేర్కొన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే మళ్లీ మంచి నీళ్ల యుద్ధం తప్పదన్నారు. సాగునీరు, తాగునీరు ఇవ్వని హస్తం పార్టీ ఇప్పుడు గ్యారెంటీలు ఇస్తే నమ్మవద్దని ఆయన అన్నారు.

KTR Fire on Congress party

సిరిసిల్ల జిల్లా గంభీరావు పేటలో లబ్ధిదారులకు 378 డబుల్ బెడ్రూం ఇళ్లను మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…. చేతి గుర్తుకు ఓటు వేస్తే మళ్లీ విత్తనాలు, ఎరువుల కోసం రైతులు క్యూ కట్టాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఏడాదికి ఒక ముఖ్యమంత్రి మారుతారని చెప్పారు.

కాంగ్రెస్ కు ఇంకా ఎన్ని అవకాశాలు ఇవ్వాలని ప్రశ్నించారు. మన రాష్ట్రంలో ఉన్న పథకాలు దేశంలో ఎక్కడా లేవని పేర్కొన్నారు. రైతుల ఖాతాలో 73 వేల కోట్లు వేశామని చెప్పారు. రెండు వందల పెన్షన్ ఇవ్వలేని వాళ్లు 4 వేల పెన్షన్ ఇస్తారంటే మనమంతా నమ్మాలా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం లక్ష రుణ మాఫీ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ 2లక్షలు చేస్తామని చెబుతోందన్నారు.

కేసీఆర్ 2 వేల పెన్షన్ ఇస్తే ఇప్పుడు వాళ్లు 4 వేలు అంటున్నారని వెల్లడించారు. ఓట్ల కోసం కాంగ్రెస్ ఎన్నైనా అబద్దాలు చెబుతుందన్నారు. 65 ఏండ్లు ఏమి చేయలేనోళ్లు ఇవాళ వచ్చి ఏదో చేస్తారంటే ఎవరూ నమ్మబోరన్నారు. ఎన్నికల్లో మందు, డబ్బు పంచనని చెప్పానన్నారు. అలా చెప్పడానికి చాలా ధైర్యం కావాలన్నారు. గంభీరావుపేటలో 365 రోజులు మంచి నీళ్లకు ఎలాంటి ఢోకా లేదన్నారు.

You may also like

Leave a Comment