Telugu News » Lakhbir Singh Landa: ఆ నేరస్థున్ని ఉగ్రవాదిగా ప్రకటించిన భారత్..!

Lakhbir Singh Landa: ఆ నేరస్థున్ని ఉగ్రవాదిగా ప్రకటించిన భారత్..!

హత్యాయత్నంతో సహా డజన్ల కొద్దీ కేసులు నమోదయ్యాయి. లాండా.. మొహాలీ, తరన్ తరణిలో జరిగిన ఆర్పీజీ(RPG) దాడులకు సూత్రధారి.

by Mano
Lakhbir Singh Landa: India declared that criminal as a terrorist..!

బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ) డైరెక్టర్ లఖ్‌బర్ సింగ్ లాండా(Lakhbir Singh Landa)ను ఉగ్రవాదిగా భారత్‌ ప్రకటించింది. లాండాపై హత్య, హత్యాయత్నంతో సహా డజన్ల కొద్దీ కేసులు నమోదయ్యాయి. లాండా.. మొహాలీ, తరన్ తరణిలో జరిగిన ఆర్పీజీ(RPG) దాడులకు సూత్రధారి.

Lakhbir Singh Landa: India declared that criminal as a terrorist..!

ఈమేరకు యూఏపీఏ చట్టం కింద లాండాను ఉగ్రవాదిగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. పాకిస్తాన్ నుంచి దేశానికి ఆయుధాలు, ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డీవైసెస్ (IED) అక్రమ రవాణాను లాండా పర్యవేక్షిస్తున్నారని ఆరోపించారు. లాండా పంజాబ్‌లోని తార్న్ తరణ్ నివాసి.

2017లో కెనడాకు పరారీ అయిన లఖ్‌బీర్ సింగ్ లాండా తలపై రూ.15లక్షల రివార్డును ఎన్ఐఏ ప్రకటించింది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్రకారం.. అతను ప్రస్తుతం కెనడాలోని అల్బెర్టాలో తలదాచుకున్నారు. పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సూచన మేరకు పంజాబ్‌లోని హిందూ నేతలను ఫండింగ్ ఆధారంగా టార్గెట్‌ చేస్తున్నాడు.

హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. లాండా పాకిస్తాన్ నుంచి భారతదేశానికి అక్రమంగా రవాణా చేయబడిన ఆయుధాలు, ఎల్ఈడీ పరికరాలను పర్యవేక్షిస్తుంది. ఆర్పీజీ దాడికి సూత్రధారి కూడా అతడే. అతనికి పాక్ గూఢచార సంస్థతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. అతడిపై పంజాబ్ పోలీసులు, ఎన్ఐఏ కేసు నమోదు చేసింది.

You may also like

Leave a Comment