Telugu News » SRI SRI daughter: శ్రీశ్రీ కుమార్తె మద్రాసు హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియామకం!

SRI SRI daughter: శ్రీశ్రీ కుమార్తె మద్రాసు హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియామకం!

శ్రీశ్రీ కుమార్తె నిడుమోలు మాలా గత ఏడాది మార్చిలో మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

by Sai
madras high court permanent judge sri sri sri daughter

మద్రాసు హైకోర్టు (Madras High Court) శాశ్వత న్యాయమూర్తులుగా సుప్రీం కోర్టు (Supreme Court) కొలీజియం ఐదుగురు న్యాయమూర్తుల పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది. వారిలో మహా కవి శ్రీశ్రీ కుమార్తె (Sri Sri Daughter) జస్టిస్‌ నిడుమోలు మాలా కూడా ఉన్నారు.

madras high court permanent judge sri sri sri daughter

ఆమెతో పాటు జస్టిస్‌ ఏఏ నక్కీరన్‌, జస్టిస్‌ ఎస్ సౌందర్‌, జస్టిస్‌ సుందరమోహన్‌, జస్టిస్‌ కె కుమరేశ్ బాబు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం మద్రాస్‌ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా విధులు నిర్వహిస్తున్నారు.

శ్రీశ్రీ కుమార్తె నిడుమోలు మాలా గత ఏడాది మార్చిలో మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆమెతోపాటు అక్కడ అదనపు న్యాయమూర్తులుగా ఉన్న ఐదుగురు.. ఇప్పుడు శాశ్వత న్యాయమూర్తులుగా నియామకం కాబోతున్నారు.

అదే విధంగా అనంత్‌ రామనాథ్‌ హెడ్గే, కన్నన్‌ కుజియిల్‌ శ్రీధరన్‌ హేమలేఖ పేర్లను కొలీజియం కర్ణాటక హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా రికమెండ్‌ చేసింది.

You may also like

Leave a Comment