Telugu News » Liquor Murder : మద్యం మత్తులో స్నేహితుడి మెడకొరికేశాడు…ఆపై ఏం జరిగిందంటే..!?

Liquor Murder : మద్యం మత్తులో స్నేహితుడి మెడకొరికేశాడు…ఆపై ఏం జరిగిందంటే..!?

by sai krishna

మద్యం ఇద్దరి స్నేహితుల మధ్య మంట పెట్టింది. నువ్వెంతంటే నువ్వెంతని కాలు దువ్వింది.వాగ్వాదం కిక్కిచ్చిన బాటిళ్లనే బద్దలు కొట్టే స్టేజ్ కి వెళ్లింది.కట్ చేస్తే రక్తం తాగుతానంటూ ఒక వ్యక్తి మరో వ్యక్తి మెడకొరికేశాడు(Man bites friend’s neck).

ఈ క్షణంతో అనూహ్య ఘటనతో స్నేహితులు శత్రువులుగా మారిపోయారు. నా రక్తం తాగుతావా అంటూ ఆగ్రహించిన స్నేహితుడు ఆ ఉన్మాదంలో మెడకొరికిన వ్యక్తిని హత్య చేశాడు.

మహారాష్ట్ర(Maharashtra) లోని పింప్రి చించ్వాడ్ జిల్లాలో (Pimpri Chinchwad district) ఈ అనివార్య సంఘటన జరిగింది. రాహుల్ లోహర్ అనే వ్యక్తి ఫ్రెండ్స్‌ తో కలిసి మద్యం తాగాడు. అయితే స్నేహితుడైన ఇష్తియాక్ ఖాన్ మద్యం మత్తులో రాహుల్‌ రక్తం తాగుతానని అన్నాడు.

అన్నట్టుగానే మెడకొరికి చూపించాడు.ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య జరిగిన ఘర్షణ తారాస్థాయికి చేరింది. అనంతరం రాహుల్‌ అక్కడి నుంచి రక్తమోడుతున్న మెడతో ఓవెళ్లిపోయాడు.


కాగా, కొంతసేపటి తర్వాత రాహుల్‌ తిరిగి ఇష్తియాక్ ఖాన్‌ను కలిశాడు. ‘నా రక్తం తాగాలనుకుంటున్నావా? నిన్ను బతుకనివ్వను’ అంటూ అతడిపై దాడి చేశాడు. ఇష్తియాక్ తలను బండరాయితో మోది హత్య చేశాడు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడు రాహుల్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా స్నేహితుల దినోత్సవ ఆరంభంలోనే ఈఘటన చోటుచేసుకోవడం దురదృష్టం.

You may also like

Leave a Comment