Telugu News » Minister appalaraju: పురంధేశ్వరి చంద్రముఖిగా మారారు : మంత్రి అప్పలరాజు

Minister appalaraju: పురంధేశ్వరి చంద్రముఖిగా మారారు : మంత్రి అప్పలరాజు

జగనన్న పాలవెల్లువ పథకంపై జనసేన, టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు కొడుక్కి లేని నొప్పి పవన్ కల్యాణ్‌కు ఎందుకంటూ సెటైర్లు విసిరారు.

by Mano
Minister Appalaraju: Purandheswari became Chandramukhi : Minister Appalaraju

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari).. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)పై మంత్రి అప్పలరాజు (Minister Appalaraju) విరుచుకుపడ్డారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగనన్న పాలవెల్లువ పథకంపై జనసేన, టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు కొడుక్కి లేని నొప్పి పవన్ కల్యాణ్‌కు ఎందుకంటూ సెటైర్లు విసిరారు.

Minister Appalaraju: Purandheswari became Chandramukhi : Minister Appalaraju

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పుడు పోయిన గౌరవం.. పురంధేశ్వరి.. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు వచ్చిందన్నారు.. కానీ, ఇప్పుడు ఆ గౌరవం పోవడమే కాదు.. బీజేపీలోనే ఆమెకు మద్దతు లేదన్నారు. ఈ మాత్రం దానికి బీజేపీ అధ్యక్షురాలుగా ఉండటం ఎందుకు? టీడీపీలో చేరితే సరిపోతుంది కదా? అని మంత్రి అప్పలరాజు సూచించారు.

ఇప్పుడున్న బ్రాండ్లు అన్నీ చంద్రబాబు హయాంలో వచ్చినవే అని పురంధేశ్వరికి తెలియదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌లు పట్టుకుని పురంధేశ్వరి రాజకీయాలు చేయకూడదు అని సూచించారు. పురంధేశ్వరి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కాస్త గౌరవం ఉండేది.. కానీ, ఇప్పుడు ఆమెకు బీజేపీలోనే మద్దతు లేదన్నారు. పురంధేశ్వరి చంద్రముఖిగా మారారు అంటూ విమర్శలు గుప్పించారు.

టీడీపీ – జనసేన ఎప్పుడూ కలిసే ఉన్నాయన్న ఆయన జనసేన కార్యకర్తల కష్టాన్ని రేటు కట్టి పవన్ కల్యాణ్.. టీడీపీకి అమ్మటం దారుణం అన్నారు. తండ్రి జైల్లో ఉంటే ఢిల్లీకి పారిపోయి మసాజ్ చేయించుకున్న వ్యక్తి లోకేష్ అంటూ ఆరోపించారు. ఇక, పురంధేశ్వరి ప్రతి రోజూ మద్యం బ్రాండ్లను టేస్ట్ చేస్తున్నారేమో.. నేను మద్యం తాగను.. నాకు ఆ టేస్ట్‌లపై అవగాహన లేదంటూ సెటైర్లు విసిరారు.

 

You may also like

Leave a Comment