Telugu News » KTR : కేసీఆర్ అంటే ఓ భరోసా… సెంటిమెంట్లు…. అయింట్ మెంట్లకు లొంగవద్దు…!

KTR : కేసీఆర్ అంటే ఓ భరోసా… సెంటిమెంట్లు…. అయింట్ మెంట్లకు లొంగవద్దు…!

కాంగ్రెస్‌ (Congress)పై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ముదనష్టపు కాంగ్రెస్ 370 మంది పిల్లలను చంపిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

by Ramu
minister ktr sensational comments to the people of rajanna sircilla

– వేములవాడను దత్తత తీసుకుంటా
– గెలిపించే బాధ్యత మీదే
– విజయం దక్కకపోతే మళ్లీ రాను
– సోనియా గాంధీ బలి దేవత
– కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు

మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వేములవాడను దత్తత తీసుకుంటానని అన్నారు. తనను గెలిపించకపోతే ఇక్కడికి రాబోనని వెల్లడించారు. కాంగ్రెస్‌ పై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముదనష్టపు కాంగ్రెస్ అనేక మంది పిల్లలను చంపిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ రోజుల్లో సోనియాగాంధీ బలి దేవత అని రేవంత్ రెడ్డి అన్నారని చెప్పారు.

ఆ వ్యక్తి, కాంగ్రెస్ వాళ్లు తాము తెలంగాణ ఇచ్చామని అంటున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ వచ్చి తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. దొరల తెలంగాణ కావాలా, ప్రజల తెలంగాణ కావాలా అని అడుగుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

రాహుల్ గాందీ ఛాలెంజ్‌ కు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు కేటీఆర్. ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికలను డిసెంబర్ లో చూద్దామన్నారు. రాహుల్ గాంధీ ముత్తాత జవహర్ లాల్ నెహ్రూ గతంలో తెలంగాణ బిడ్డలను చంపించారని తెలిపారు.

గుజరాత్, ఢిల్లీ నుంచి వచ్చే వ్యక్తులు కేసీఆర్‌ ను ఏం చేయలేరని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ ఎంత అని అంటున్నారని.. అలాంటి వ్యక్తిని కొట్టేందుకు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారని దుయ్యబట్టారు.

పందులే గుంపుగా వస్తాయని, సింహం మాత్రం సింగిల్ గానే వస్తుందన్నారు. ఈ ఎన్నికలు తమ కోసం కాదని.. తెలంగాణ ఆగం కావద్దని చెప్పారు. ఇక్కడ పోరాటం కేవలం నిలబడ్డ వ్యక్తితో కాదని, కాంగ్రెస్‌ తో మాత్రమేనన్నారు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఘర్షణ కాదని.. కేసీఆర్ అంటే నమ్మకం, పెద్ద భరోసా అని తెలిపారు. సెంటిమెంట్లు, ఆయింట్ మెంట్‌ లకు లొంగొద్దన్నారు కేటీఆర్.

You may also like

Leave a Comment