Telugu News » Uttam Kumar Reddy : రేషన్ మిల్లర్లకు వార్నింగ్ ఇచ్చిన ఉత్తమ్.. అలా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక..!!

Uttam Kumar Reddy : రేషన్ మిల్లర్లకు వార్నింగ్ ఇచ్చిన ఉత్తమ్.. అలా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక..!!

రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా పరిగణిస్తుందని హెచ్చరించారు. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్న మిల్లర్లు, లేదా ఇతర వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌పై దాదాపు రూ.56 వేల కోట్ల భారీ అప్పుల భారం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మోపిందని మంత్రి ఉత్తమ్ అన్నారు.

by Venu

రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్న రైస్ మిల్లర్ల పై మండిపడ్డారు నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy).. హుజూర్‌నగర్‌లో (Huzurnagar) రేషన్ దుకాణాలను సోమవారం తనిఖీ చేసిన ఆయన.. మిల్లర్లకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.. రేషన్ బియ్యం పక్కదారి పట్టడం, దుర్వినియోగంపై, ఉత్తమ్ ఆందోళన వ్యక్తం చేశారు.

Uttam Kumar Reddy: 'Police in favor of the ruling party'.. Uttam's impatience..!

ప్రస్తుతం తెలంగాణ (Telangana)లో కేంద్ర ప్రభుత్వం నుంచి 5 కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక కిలో బియ్యం.. దాదాపు 54 లక్షల మంది రేషన్ కార్డుదారులకు అందుతున్నాయని తెలిపిన ఉత్తమ్.. మరో 35 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా 6 కిలోల బియ్యాన్ని అదనంగా అందిస్తుందని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి బియ్యం సేకరణ ఖర్చు కిలోకు రూ.39 అయితే, దాదాపు 70-75% రేషన్ బియ్యాన్ని మిల్లర్లు, ఇతర అసాంఘిక సంస్థలు రీసైకిల్ చేస్తున్నాయని ఉత్తమ్ కుమార్ వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా పరిగణిస్తుందని హెచ్చరించారు. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్న మిల్లర్లు, లేదా ఇతర వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌పై దాదాపు రూ.56 వేల కోట్ల భారీ అప్పుల భారం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మోపిందని మంత్రి ఉత్తమ్ అన్నారు.

2014లో బీఆర్‌ఎస్‌ (BRS) ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పుడు రాష్ట్ర అప్పు రూ. 33వందల కోట్ల మాత్రమేనని తెలిపిన ఉత్తమ్.. ప్రస్తుతం రేషన్ పంపిణీ, వరి ధాన్యం సేకరణ బాధ్యత కలిగిన కార్పొరేషన్ వార్షిక వడ్డీ భారం రూ.3,000 కోట్లు దాటిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఈ శాఖ పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహించడంతో దశాబ్ధ కాలంగా కార్పొరేషన్‌కు రూ.11 వేల కోట్ల నష్టం వాటిల్లిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎలాంటి సెక్యూరిటీ లేదా బ్యాంక్ గ్యారెంటీ లేకుండా రైస్ మిల్లర్లకు రూ.22,000 కోట్ల విలువైన వరి నిల్వలను అప్పగించిన విధానాన్ని ఆయన తప్పుపట్టారు.

You may also like

Leave a Comment