Telugu News » MP Gorantla Madhav: చంద్రబాబుపై ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు..!

MP Gorantla Madhav: చంద్రబాబుపై ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు..!

సామాజిక సాధికార యాత్రలో గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. చంద్రబాబు బస్సు యాత్ర చేసి.. జైలు యాత్ర చేస్తున్నాడన్నారు. పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేసి పారిపోయే యాత్ర చేస్తున్నారని విమర్శించారు.

by Mano

 సామాజిక సాధికార యాత్రలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్(Mp Gorantla Madhav) సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో చంద్రబాబు(Chandra Babu) ఛస్తాడని.. జగన్మోహన్ రెడ్డి(Jaganmohan Reddy) సీఎం అవుతారని జోస్యం చెప్పారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీలో తీవ్ర దుమారం రేకెత్తిస్తున్నాయి.

 

సామాజిక సాధికార యాత్రలో గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. చంద్రబాబు బస్సు యాత్ర చేసి.. జైలు యాత్ర చేస్తున్నాడన్నారు. పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేసి పారిపోయే యాత్ర చేస్తున్నారని విమర్శించారు. లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టి పిల్లి యాత్ర చేస్తున్నాడన్నారు. పవన్ వారాహి యాత్ర ఆపేసి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. లోకేష్ తన పాదయాత్ర చుట్టి పెట్టి పారిపోయాడని గోరంట్ల మాధవ్ వ్యాఖ్యానించారు.

ఎవరెన్ని యాత్రలు చేసినా జగన్ మోహన్‌రెడ్డి జైత్రయాత్రను ఆపలేరని గోరంట్ల అన్నారు. 2024లో ముఖ్యమంత్రిగా రావడం ఖాయమన్నారు. పంచాయతీ నుంచి మండలాలు, జడ్పీ, ఎమ్మెల్యేలు, మంత్రులు అన్ని పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రధాన్యత కల్పించారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో 175సీట్లు గెలవడం ఖాయమన్నారు.

ఇప్పటికే జైలులోనే చంద్రబాబును చంపేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పలువురు టీడీపీ నేతలు పలు సందర్భాల్లో తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు చస్తాడంటూ ఏకంగా వైసీపీ ఎంపీ అయిన గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలతో తెలుగు తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

You may also like

Leave a Comment