Telugu News » MP Vijaya Sai Reddy ‘మీ అంతిమ లక్ష్యం కుల ఉద్ధారణే..’ పురంధేశ్వరిపై ఎంపీ సాయిరెడ్డి సెటైర్లు!

MP Vijaya Sai Reddy ‘మీ అంతిమ లక్ష్యం కుల ఉద్ధారణే..’ పురంధేశ్వరిపై ఎంపీ సాయిరెడ్డి సెటైర్లు!

వీరిద్దరూ నిరంతర విమర్శలు చేసుకుంటూ పొలిటికల్ హీట్‌ను పెంచేస్తున్నారు. తాజాగా ఎంపీ విజయ సాయిరెడ్డి మరోసారి పురంధేశ్వరిపై ట్విట్టర్(X) వేదికగా సెటైర్లు విసిరారు.

by Mano
Vijayasaireddy: Amma Purandheswari.. this is politics: MP Vijayasaireddy

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం ఆగడంలేదు. వీరిద్దరూ నిరంతర విమర్శలు చేసుకుంటూ పొలిటికల్ హీట్‌ను పెంచేస్తున్నారు. తాజాగా ఎంపీ విజయ సాయిరెడ్డి మరోసారి పురంధేశ్వరిపై ట్విట్టర్(X) వేదికగా సెటైర్లు విసిరారు.

Vijayasaireddy: Amma Purandheswari.. this is politics: MP Vijayasaireddy

‘ఎన్టీఆర్ గారి ఇంటికి పదడుగుల దూరంలో ఉండి కూడా ఆయనకు ఒక్క ముద్ద కూడా పెట్టలేదు కదా చెల్లెమ్మా పురందేశ్వరి..! ఆ వయస్సులో ఆయన అనారోగ్యంతో బాధపడుతూ కూడా కష్టపడి సాధించుకున్న అధికారాన్ని ఎనిమిది నెలలు కూడా తిరక్కుండానే మీరు, మీ భర్త, మీ బావ గారితో చేతులు కలిపి.. పాపం..! 73 ఏళ్ల వయస్సులో ఆపెద్దాయనను నిర్దాక్షిణ్యంగా కిందికి లాగిపడేశారే.. ఏం కూతురివమ్మా నీవు..? శత్రువుకి కూడా ఇలాంటి కూతుళ్ళు పుట్టాలని ఎవరూ కోరుకోరమ్మా..! అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాసుకొచ్చారు

అదేవిధంగా విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌లో ‘పురందేశ్వరి గారు.. కులం, కుటుంబం చుట్టే మీ రాజకీయాలు.. నదులన్నీ సముద్రంలో కలిసినట్లు.. మీ ప్రతి కదలిక, ఆలోచన అంతా స్వార్ధ ప్రయోజనాలే.. మీ అంతిమ లక్ష్యం కుల ఉద్ధారణే.. మీకు సిద్ధాంతం, విధానం, ప్రవర్తన, వ్యక్తిత్వం, సమాజహితం, మంచి, స్నేహం, ధర్మం, న్యాయం ఏమీ లేవు.. స్వార్థం తప్ప.. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం..’ అని పేర్కొన్నారు.

విజయసాయిరెడ్డి నిన్ననే ఓ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.. అందులో ‘సీనియర్ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన కుట్రలో కత్తి అందించింది పురంధేశ్వరి దంపతులే..’ అని పేర్కొనడం తీవ్ర దుమారం రేపింది. అదేవిధంగా పురంధేశ్వరి పార్టీలు మారడంపై సాయిరెడ్డి ఆ ట్వీట్‌లో ఘాటుగా స్పందించారు. తండ్రిని కాటికి పంపిన వ్యక్తికి పార్టీలు మారడం ఒక లెక్కా అంటూ రాసుకొచ్చారు.

 

You may also like

Leave a Comment