Telugu News » MS Dhoni : అరెస్ట్‌ అయిన ధోనీ మాజీ బిజినెస్‌ పార్ట్‌నర్.. పరారీలో మరొకరు..!

MS Dhoni : అరెస్ట్‌ అయిన ధోనీ మాజీ బిజినెస్‌ పార్ట్‌నర్.. పరారీలో మరొకరు..!

ఆర్కా స్పోర్ట్స్‌.. మహీకి డబ్బు చెల్లించడంలో విఫలమైంది. ఈ విషయంపై పలుమార్లు చర్చలు జరిగిన అవి ఫలించకాపోవడంతో.. ఆ ఒప్పందం నుంచి ధోనీ వైదొలిగారు

by Venu
police arrested two people from film industry in madhapur

రాంచీ (Ranchi) జిల్లా కోర్టులో మూడు నెలల క్రితం టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) అనుమతి లేకుండా తన పేరును క్రికెట్ అకాడమీల కోసం వాడుకొన్నారని దివాకర్‌తో పాటు సౌమ్యా దాస్‌పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో పోలీసులు ధోనీ మాజీ బిజినెస్‌ పార్ట్‌నర్ మిహిర్‌ దివాకర్‌ ను జైపుర్‌ (Jaipur)లో అరెస్ట్‌ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు అదుపులోకి తీసుకొన్నారు.

అలాగే సౌమ్యా దాస్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఇదిలా ఉండగా 2017లో ఎంఎస్ ధోనీతో మిహిర్‌ దివాకర్‌కు చెందిన ఆర్కా స్పోర్ట్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్ లిమిటెడ్‌ సంస్థ.. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ అకాడమీలను ఏర్పాటు చేయడానికి ఒప్పందం చేసుకొంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఫ్రాంఛైజీ ఫీజులు, లాభాల్లోని వాటాను ధోనీకి చెల్లించాల్సి ఉంది..

కానీ ఆర్కా స్పోర్ట్స్‌.. మహీకి డబ్బు చెల్లించడంలో విఫలమైంది. ఈ విషయంపై పలుమార్లు చర్చలు జరిగిన అవి ఫలించకాపోవడంతో.. ఆ ఒప్పందం నుంచి ధోనీ వైదొలిగారు.. అంతేకాకుండా 2021 ఆగస్టు 15న ఆ సంస్థకు ఇచ్చిన అథారిటీ లెటర్‌ను సైతం ధోనీ రద్దు చేసుకొన్నారు.. లీగల్‌ నోటీసులు కూడా పంపించారు. ఈ క్రమంలో దివాకర్‌, సౌమ్య దాస్‌ల నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతో.. కోర్టును ఆశ్రయించారు..

ఈ నేపథ్యంలో ఇద్దరిపై రాంచీ కోర్టులో క్రిమినల్‌ కేసు దాఖలు అయ్యింది. అలాగే ఆర్కా స్పోర్ట్స్‌ (Arca Sports) ఒప్పందాన్ని ఉల్లంఘించిన కారణంగా రూ.15 కోట్ల నష్టం వాటిల్లినట్లు ధోనీ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ప్రస్తుతం కోర్టు ఆదేశాల మేరకు దివాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

You may also like

Leave a Comment