Telugu News » Nara Lokesh: ‘రాష్టాన్ని జగన్ సర్వనాశనం చేశాడు’.. నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు..!

Nara Lokesh: ‘రాష్టాన్ని జగన్ సర్వనాశనం చేశాడు’.. నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు..!

నిరుద్యోగంపై తెలుగుదేశం పార్టీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో నిరుద్యోగం అత్యధికంగా పెరిగిపోతోందన్నారు.

by Mano
Nara Lokesh: 'Jagan has destroyed the state'.. Nara Lokesh's key comments..!

ఏపీ(AP)లో నిరుద్యోగంపై తెలుగుదేశం పార్టీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో నిరుద్యోగం అత్యధికంగా పెరిగిపోతోందన్నారు. అత్యధికంగా నిరుద్యోగిత రేటు నమోదవ్వడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ఈ మేరకు మంగళవారం ట్వీట్ చేశారు.

Nara Lokesh: 'Jagan has destroyed the state'.. Nara Lokesh's key comments..!

‘‘రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 24 శాతానికి పెరగడం దురదృష్టకరం.. టీడీపీ హయాంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో వర్ధిల్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైఎస్ జగన్ సర్వనాశనం చేశారు. దీని ఫలితంగా యువత నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారు. అన్ని అర్హతలు ఉన్న ఏపీ యువత భవిత మెరుగుపడాలి’’ అంటూ లోకేశ్‌ X (ట్విట్టర్) వేదికగా రాసుకొచ్చారు.

మరోవైపు నారా లోకేశ్ చేపట్టిన యువగళం ముగింపు సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 18కి యువగళం పాదయాత్ర ముగియనుంది. అనంతరం ఈనెల 20న విజయనగరం భోగాపురంలో భారీ బహిరంగ సభను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణలు ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు.

ఇప్పటికి యువగళం పాదయాత్ర 3వేల కి.మీ పూర్తిచేసుకుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తుని రాజులకొత్తూరు నియోజకవర్గం వద్ద ఈ మైలురాయికి చేరుకుంది. ఈ సందర్భంగా లోకేశ్ పైలాన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి లోకేశ్ సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్, నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్, బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ హాజరైన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రస్తుతం నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఉమ్మడి విశాఖ పాయకరావుపేటలో కొనసాగుతోంది.

You may also like

Leave a Comment