Telugu News » PM Modi: బాధలో ఉన్నా పార్టీని గెలిపించారు.. నడ్డాపై ప్రధాని ప్రశంసలు జల్లు..!

PM Modi: బాధలో ఉన్నా పార్టీని గెలిపించారు.. నడ్డాపై ప్రధాని ప్రశంసలు జల్లు..!

ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ప్రధాని మోడీ (PM Modi) మాట్లాడారు.. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda)పై ప్రశంసలు కురిపించారు.

by Mano
PM Modi: He won the party despite suffering.. Prime Minister showered praise on Nadda..!

అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) మూడు రాష్ట్రాల్లో బీజేపీ (BJP) స్పష్టమైన మెజార్టీతో అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ప్రధాని మోడీ (PM Modi) మాట్లాడారు.. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda)పై ప్రశంసలు కురిపించారు.

PM Modi: He won the party despite suffering.. Prime Minister showered praise on Nadda..!

ఎన్నికలకు ముందు ఆయన తన కుటుంబంలోని ఓ వ్యక్తిని కోల్పోయారు. అయినప్పటికీ.. మనోధైర్యం కోల్పోకుండా పూర్తి నిబద్ధత, అంకితభావంతో పార్టీని ముందుకు నడిపించారని ప్రధాని మోడీ తెలిపారు. పార్టీలో తన బాధ్యతలను నడ్డా సమర్థవంతంగా నిర్వహించడం వల్లనే ఈ విజయం సాధ్యమైందన్నారు ప్రధాని మోడీ.

ఎన్నికలకు ముందు ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నప్పటికీ.. ఆ ప్రభావం పార్టీపై పడకుండా పనిచేశారని అభినందించారు. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అవిశ్రాంత కృషి వల్లే మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు.

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘఢ్ ఫలితాలు వెలువడిన తర్వాత జేపీ నడ్డా కుటుంబసభ్యులతో కలిసి ఢిల్లీలోని హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో పాల్గొన్న జేపీ నడ్డా.. ప్రధాని మోడీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి మూడు రాష్ట్రాల ఫలితాలు నిదర్శనమని అన్నారు.

You may also like

Leave a Comment