Telugu News » ఇప్పటికైనా మాట్లాడండి..మోC జీ: రాహుల్‌ గాంధీ!

ఇప్పటికైనా మాట్లాడండి..మోC జీ: రాహుల్‌ గాంధీ!

అందులో అరుణాచల్‌ప్రదేశ్, అక్సాయ్ చిన్ ప్రాంతంతోపాటు తైవాన్, వివాదాస్పద సౌత్‌ చైనా సముద్రాన్ని తనవిగా చూపించింది.

by Sai
rahul

డ్రాగన్‌ కంట్రీ మరోసారి తన వక్రబుద్ధిని చూపించింది. భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌, అక్సాయ్‌ రెండు కూడా తమ భూభాగంలోనివే అంటూ మంగళవారం కొత్త మ్యాప్‌ ను విడుదల చేసింది. ఈ విషయం గురించి ప్రతిపక్షాలు స్పందించాయి. చైనా తాజాగా విడుదల చేసిన మ్యాప్‌లో భారత భూభాగాలను కూడా తనవిగా చూపించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్రంగా స్పందించారు.

rahul

భారత సరిహద్దు వెంబడి జరుగుతున్న చైనా కార్యకలాపాలపై ప్రధాని మోడీ స్పందించాలని డిమాండ్ చేశారు. చైనా విషయంలో ఏదో ఒకటి మాట్లాడాల్సిందేనని అన్నారు. లడఖ్‌లో ఒక్క అంగుళం కూడా భూమి ఆక్రమణకు గురికాలేదని ప్రధాని చెబుతున్నది అబద్ధమని తాను చాలా సంవత్సరాలుగా చెబుతున్నానని, చైనా అతిక్రమించిందన్న విషయం లడఖ్ మొత్తానికి తెలుసని అన్నారు.

ఈ మ్యాప్ చాలా తీవ్రమైన అంశమని, వారు మన భూమిని లాక్కున్నారని, దీనిపై ప్రధాని ఏదైనా మాట్లాడాలని డిమాండ్ చేశారు. చైనా సోమవారం కొత్త ఎడిషన్ ‘స్టాండర్డ్ మ్యాప్’ను విడుదల చేసింది. అందులో అరుణాచల్‌ప్రదేశ్, అక్సాయ్ చిన్ ప్రాంతంతోపాటు తైవాన్, వివాదాస్పద సౌత్‌ చైనా సముద్రాన్ని తనవిగా చూపించింది.

దీనిపై కేంద్ర ప్రభుత్వం తీవంగ్రా స్పందించింది. బీజింగ్‌పై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. చైనాకు ఇలాంటివి అలవాటుగా మారిందని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ విమర్శించారు.

You may also like

Leave a Comment