అంతర్జాతీయ మహిళా దినోత్సవం (Women’s Day) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వంట గ్యాస్ సిలిండర్పై రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) ప్రకటించారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని, ముఖ్యంగా నారీ శక్తికి ప్రయోజనం చేకూరుస్తుందని ట్విట్టర్ (Twitter) వేదికగా ప్రధాని పేర్కొన్నారు.

సంవత్సరంలో 12 సిలిండర్లు రీఫిల్లింగ్ కోసం పొందేందుకు వీలు కల్పిస్తుంది. మరోవైపు వంట గ్యాస్ను మరింత సరసమైనదిగా చేయడం ద్వారా, లక్షలాది కుటుంబాల శ్రేయస్సుకు మద్దతు ఇవ్వడంగా భావిస్తున్నామని మోడీ తెలిపారు. ఇది మహిళలకు సాధికారత కల్పించేందుకు, వారికి ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ను అందించడానికి మా నిబద్ధతకు అనుగుణంగా ఉందని ప్రధాన మంత్రి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ X ద్వారా పేర్కొన్నారు..